‘ఆర్మూర్’లో శ్రమదానం

‘ఆర్మూర్’లో శ్రమదానం

ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన శ్రమదానం ఆదివారం 10వ వారానికి చేరుకుంది. మున్సిపల్ పరిధిలోని వెంకటేశ్వర కాలని లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రమదానం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా సంస్థ సభ్యులు వెంకటేశ్వర ఆలయం కమిటీ సభ్యులు, భక్తులతో కలిసి ఆలయం ఆవరణలోని చెత్తాచెదారం, పిచ్చి మొక్కలను తొలగించి పరిసరాలు శుభ్రం చేశారు.

కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు గడ్డం సంజీవరెడ్డి, శ్రావణ్, భోజన్న, స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు సుంకె శ్రీనివాస్, అల్జాపూర్​ మహేందర్, సభ్యులు ప్రశాంత్, సుంకె నిశాంత్, జీడి రాజ్ కుమార్, జంగిడి బోజన్న, గణేశ్, ఒత్తూరు రాజయ్య, నరేశ్, నూకల ఆదిత్య, ముధుసూదన్, బాశెట్టి పెద్ద గంగారాం, శ్యాంసుందర్, కృషివర్ధన్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.