సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ తెరకెక్కించిన మైథాలాజికల్ మూవీ ‘శాకుంతలం’. దిల్ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 14న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా సోమవారం నిర్వహించిన ప్రెస్మీట్లో సమంత మాట్లాడుతూ ‘ఈ కథ నాకు చిన్నప్పట్నుంచీ తెలుసు కానీ.. పూర్తిస్థాయిలో తెలీదు. గుణ సర్ చెప్పినప్పుడు కొన్ని ఎలిమెంట్స్ విని సర్ప్రైజ్ అయ్యాను. ఇప్పటి జనరేషన్కు కూడా శకుంతల క్యారెక్టర్ రిలేట్ అవుతుంది. ప్రతి సినిమాకి నా బెస్ట్ ఇవ్వడానికి మాక్సిమమ్ ట్రై చేస్తాను. ఈ సినిమా నాకొక పెద్ద బాధ్యత.
అందుకే మొదట భయపడి నో చెప్పాను. కానీ ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. శకుంతల ఎలా ఉండాలనే రిఫరెన్స్ కోసం ఎలాంటి సినిమాలు చూడొద్దన్నారు గుణశేఖర్. ఎందుకంటే ఆయనకొక స్పెషల్ విజన్ ఉంది. ఆయన మైండ్లో ఏం ఉందో.. అదే వైబ్లో ఉండేలా చూసుకున్నాను. త్రీడీలో నన్ను నేను చూసుకోవడం చాలా హ్యాపీగా ఫీలయ్యా. ఒక మేజికల్ వరల్డ్ని క్రియేట్ చేశారు’ అని చెప్పింది. గుణశేఖర్ మాట్లాడుతూ ‘శకుంతల పుట్టుక దగ్గర్నుంచీ అన్ని ఎమోషన్స్ ఇందులో చూపించాం. ప్రస్తుత జెనరేషన్ ప్రేక్షకులకు అర్ధమయ్యేలా రూపొందించాం’ అన్నారు.
దిల్ రాజు మాట్లాడుతూ ‘సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా అన్ని జానర్స్ చేశా. ఇది నాకు కొత్త జానర్. మంచి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి గుణశేఖర్ ప్రయత్నంలో పార్ట్ అయ్యాను. అవుట్పుట్ చూసి మేమంతా హ్యాపీగా ఉన్నాం. హాలీవుడ్ స్టైల్లో ఇకపై ముందునుంచే ప్రీమియర్స్ వేయాలనే ప్లాన్లో ఉన్నాం’ అన్నారు.