శాకుంతలం రిజల్ట్ బాధించింది : మధుబాల

శాకుంతలం రిజల్ట్ బాధించింది : మధుబాల

గుణశేఖర్​ దర్శకత్వంలో సమంత నటించిన ‘శాకుంతలం’ సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆడియెన్స్​ను మాత్రం ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. దీంతో కలెక్షన్ల పరంగానూ ఈ సినిమా వెనకబడింది. తాజాగా ఈ రిజల్ట్​పై సీనియర్​ హీరోయిన్​ మధుబాల కామెంట్స్ చేశారు. ఇందులో మేనక పాత్రలో మెరిసిన ఈ నటి.. సినిమా ఫెయిల్యూర్​ తనను బాధించిందని తెలిపింది.

‘‘బాహుబలి, ఆర్​ఆర్​ఆర్​ వంటి సినిమాలు హిట్టవ్వడానికి పెద్ద కారణాలేమీ లేవు. పురాణాల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా సైతం అదే స్థాయిలో విజయం అందుకుంటుందని భావించాం. టీం అంతా ఎంతో శ్రమించి పనిచేశారు. సీజీఐ వర్క్​ కోసమే ఏడాది పాటు కష్టపడ్డారు. కానీ, ఇలాంటి రిజల్ట్ ఊహించలేదు’’ అంటూ మధుబాల తెలిపింది.