గుణశేఖర్ దర్శకత్వంలో సమంత నటించిన ‘శాకుంతలం’ సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆడియెన్స్ను మాత్రం ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. దీంతో కలెక్షన్ల పరంగానూ ఈ సినిమా వెనకబడింది. తాజాగా ఈ రిజల్ట్పై సీనియర్ హీరోయిన్ మధుబాల కామెంట్స్ చేశారు. ఇందులో మేనక పాత్రలో మెరిసిన ఈ నటి.. సినిమా ఫెయిల్యూర్ తనను బాధించిందని తెలిపింది.
‘‘బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలు హిట్టవ్వడానికి పెద్ద కారణాలేమీ లేవు. పురాణాల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా సైతం అదే స్థాయిలో విజయం అందుకుంటుందని భావించాం. టీం అంతా ఎంతో శ్రమించి పనిచేశారు. సీజీఐ వర్క్ కోసమే ఏడాది పాటు కష్టపడ్డారు. కానీ, ఇలాంటి రిజల్ట్ ఊహించలేదు’’ అంటూ మధుబాల తెలిపింది.