ఏటీఆర్ లోకి శంషాబాద్  చిరుత

ఏటీఆర్ లోకి శంషాబాద్  చిరుత

అమ్రాబాద్, వెలుగు: శంషాబాద్  ఎయిర్ పోర్ట్ లో హల్ చల్  చేసిన చిరుతను శనివారం అమ్రాబాద్  టైగర్  రిజర్వ్ లో ఫారెస్ట్  ఆఫీసర్లు విడిచిపెట్టినట్లు మన్ననూర్  ఎఫ్ఆర్వో ఈశ్వర్  తెలిపారు. ఎయిర్ పోర్ట్  వద్ద శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో మేకను ఎరవేసి బంధించారు. అనంతరం నెహ్రూ జూపార్క్ లో వైద్య పరీక్షలు నిర్వహించి, అర్ధరాత్రి అమ్రాబాద్  టైగర్  రిజర్వ్ లో వదిలేశారు. చిరుత ఆరోగ్యంగా ఉందని, ట్రాప్  కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.