ఎవరూ లేని ఇండ్లే అతడి టార్గెట్...

ఎవరూ లేని ఇండ్లే అతడి టార్గెట్...

వరుస చోరీలకు పాల్పడుతున్న గౌస్ పాషా అలియాస్ కూని గౌస్ ను శంషాబాద్ ఎస్ వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నిందితుడి వద్ద నుండి సుమారు 25 లక్షల విలువ చేసే 50 తులాల బంగారం ఒక కత్తి స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. రాజేంద్రనగర్, ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వీటితో పాటు పలు పోలీస్ స్టేషన్లలో దాదాపు 20 కేసులలో గౌస్ పాషా నిందితుడిగా ఉన్నాడు.  తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తారని, వాహనంలో ఎప్పుడు ఇనుప రాడ్డు, కటింగ్ ప్లేయర్,  స్ర్కూ  డ్రైవర్  వీటి సహాయంతో తలుపులు తెరిచి ఇంట్లోకి ప్రవేశించి విలువైన ఆభరణాలు నగదు చోరీ చేస్తాడని తెలిపారు. వారం రోజుల క్రితం అర్ధరాత్రి మద్యం సేవించి ఎంఎం పహాడి ప్రాంతంలో ప్రజలను భయాందోళనలనకు గురి చేసి పలు వాహనాల  ధ్వంసం చేశాడని చెప్పారు. గతంలోనూ నిజాం మ్యూజియంలో బంగారు టిఫిన్ బాక్స్ చోరీ చేసి అందులో భోజనం చేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని చెప్పారు. నిందితుడి పై రౌడీ షీట్ ఓపెన్ చేసి పీడీ ఆక్ట్ నమోదు చేస్తామని డీసీపీ తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు