వరల్డ్ ట్రైబల్ ఫోటో ఆఫ్ ది ఇయర్ అవార్డుకు షరీఫ్ ఫొటో ఎంపిక

వరల్డ్ ట్రైబల్ ఫోటో ఆఫ్ ది ఇయర్ అవార్డుకు షరీఫ్ ఫొటో ఎంపిక

భద్రాచలం, వెలుగు : వరల్డ్ ట్రైబల్​ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి కమిషన్​ సహకారంతో ఇండియా ఇంటర్నేషనల్​ ఫొటోగ్రాఫిక్​ కౌన్సిల్​(ఐఐపీసీ), ఫొటోగ్రఫీ అకాడమీ ఆఫ్​ ఇండియా (పీఏఐ) నిర్వహించిన నేషనల్​ ఫొటో ఎగ్జిబిషన్​లో భద్రాచలానికి చెందిన ఫొటోగ్రాఫర్​ షరీఫ్​ తీసిన ఫొటో ట్రైబల్ ఫొటో ఆఫ్ ది ఇయర్​ అవార్డుకు ఎంపికైంది. వరల్డ్ ట్రైబల్​ డే సందర్భంగా ఈనెల 9న ఈ అవార్డును ఆయనకు అందజేయనున్నారు. ఈ సందర్భంగా పట్టణ ప్రముఖులు ఆయనను అభినందించారు.