పేపర్ లీక్ పై సీబీఐతో విచారించాలె : వైఎస్ షర్మిల

పేపర్ లీక్ పై సీబీఐతో విచారించాలె : వైఎస్ షర్మిల

పేపర్ లీక్​లో నీ దోస్తులున్నరనే.. నాకేం సంబంధం అంటున్నవా?
కేటీఆర్​పై షర్మిల ఫైర్​

హైదరాబాద్, వెలుగు: పేపర్ లీక్ బయటపడే సరికి మంత్రి కేటీఆర్.. తనకేం సంబంధం లేదని ప్రకటనలు చేస్తున్నారని వైఎస్సార్​టీపీ చీఫ్ షర్మిల ఆరోపించారు. నిన్నమొన్నటిదాకా టీఎస్​ పీఎస్సీ ద్వారా లక్షా 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని గొప్పలు చెప్పుకున్నారని ఆదివారం ఒక ప్రకటనలో ఎద్దేవా చేశారు. ‘‘నీ వాటా, నీ కోటా, నీ హస్తం, నీ దోస్తులు ఉన్నారని తెలిసేసరికి.. టీఎస్​ పీఎస్సీ అక్రమం అయిపోయిందా? స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న వ్యవస్థలు సర్కారు పరిధిలో ఉండవని బొంకుతున్నావా? పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీ అధీనంలో లేకపోతే.. సభ్యులను నియమించినందుకు హైకోర్టుకు ఎందుకు సంజాయిషీ ఇచ్చావ్​?  నీది కాని శాఖల మంత్రులతో నువ్వెందుకు రివ్యూలు చేస్తున్నవ్?’’ అని కేటీఆర్​ను ప్రశ్నించారు. టీఎస్​పీఎస్సీ స్వతంత్ర వ్యవస్థ అని చెప్పుకుంటనే ప్రతిపక్షాల మీద కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. సీబీఐ విచారణ చేయిస్తే నిజాలు బయటపడ్తాయన్నారు.