వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర 65వ రోజు కొనసాగుతుంది. సీతారామపురం గ్రామంలో రైతు గోస ధర్నాలో పాల్గొన్నారు. దిక్కుతోచని స్థితిలో రాష్ట్ర రైతాంగం ఉందన్నారు. రైతుల ఆత్మహత్యల పాపం ఎవరిదని ప్రశ్నించారు. అన్నదాతల కష్టాలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని స్థితిలో ఉన్నారన్నారు. రైతుల కష్టాలు సీఎం కేసీఆర్ కు పట్టడంలేదన్నారు విమర్శించారు. పోడు భూములకు పట్టాలు ఇచ్చేవరకు పోరాటం చేస్తామన్నారు.
మరిన్ని వార్తల కోసం