అభిమానికి షారుఖ్ వీడియో కాల్.. నేనున్నానంటూ భరోసా

అభిమానికి షారుఖ్ వీడియో కాల్.. నేనున్నానంటూ భరోసా

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ మరోసారి తన సహృదయాన్ని చాటుకున్నాడు. క్యాన్సర్ తో బాధపడుతున్న తన అభిమానికి కి వీడియో కాల్ చేశాడు. దాదాపు 40 నిమిషాలపాటు మాట్లాడిన షారుఖ్.. ఆమెకు ధైర్యాన్ని అందించాడు. కోల్ కతాకు చెందిన 60 ఏళ్ళ శివానీకి షారుఖ్ ఖాన్ అంటే చాలా ఇష్టం. జీవితంలో ఒక్కసారైనా షారుఖ్ ను కలవాలనేది ఆమె కోరిక. 

అయితే ఆమె ఇటీవలే క్యాన్సర్ బారిన పడింది. దీంతో ఆమె కూతురు.. తన తల్లి శివాని కోరికని తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేసింది. ఆ వీడియో ఫుల్ వైరల్ అయింది. విషయం తెలుకున్న షారుఖ్.. తానే స్వయంగా  వీడియో కాల్ చేసి శివానితో మాట్లాడాడు. అంతేకాదు, ఆమె చికిత్స కోసం అయ్యే ఖర్చును తానే భరిస్తానాని హామీ కూడా ఇచ్చాడు. ఈ విషయం తెలుకున్న ఫ్యాన్స్.. షారుఖ్ రియల్ హీరో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

ఇక షారుఖ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన జవాన్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను తమిళ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తుండగా.. నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.