
యంగ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్(Sharwanand), కృతిశెట్టి(Krithi Shetty) జంటగా, శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఫ్యామిలీ రొమాంటిక్ డ్రామా జూన్ 7 న థియేటర్లలో రిలీజై ఆడియన్స్ ను ఆకట్టుకుంది. కథా నేపథ్యం, శర్వానంద్, కృతిశెట్టి నటన, కామెడీ, ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను వీపరీతంగా ఆకట్టుకున్నాయి.
అయితే, మేకర్స్ అంచనాలకు తగ్గట్టుగా భారీ కలెక్షన్లను రాబట్టలేకపోయింది.ఈ ఫ్యామిలీ రొమాంటిక్ డ్రామా మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (Disney plus Hotstar) వేదికగా జూలై 12న ఓటీటీలో స్ట్రీమింగ్కు రానున్నట్లు తెలుస్తోంది. మేకర్స్ నుంచి త్వరలోనే అఫిషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది.ఈ సినిమాలో ఖుషి ఫేమ్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సూపర్బ్ మ్యూజిక్ అందించాడు. పదహారు పాటలతో ఈ సినిమాను ఆద్యంతం మ్యూజికల్ పంథాలో నడిపించాడు.
కథ:
విక్రమ్(శర్వానంద్) లండన్ లో అమ్మాయిలని ఫ్లర్ట్ చేస్తూ ఏపని లేకుండా లైఫ్ జాలీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అతని ప్రాణ స్నేహితుడు అనురాగ్ ఫ్యామిలీ యాక్సిడెంట్ లో చనిపోవడంతో..వాళ్ళ కొడుకు ఖుషి (విక్రమ్ ఆదిత్య) బాధ్యత విక్రమ్ తీసుకోవాల్సి వస్తుంది. విక్రమ్, ఖుషీ మధ్యలోకి సుభద్ర (కృతిశెట్టి) కూడా వస్తుంది. మరి ఖుషి బాగోగులు చూసుకునే క్రమంలో విక్రమ్ కు తెలిసిన విషయాలు ఏంటి? ఖుషీకి సుభద్రకు ఉన్న లింక్ ఏంటి? అనేది మిగిలిన కథ.
మనమే తర్వాత హీరో శర్వానంద్ యూవీ క్రియేషన్స్లో ఓ సినిమా చేస్తోన్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ మూవీతో అభిలాష్రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.