ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించండి: శశిథరూర్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష పీఠంపై ఎవరిని కూర్చోబెట్టాలనే విషయాన్ని పార్టీ కార్యకర్తలు నిర్ణయిస్తే బాగుంటుందని ఆ పార్టీ సీనియర్నేత శశిథరూర్అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఆ పోస్టును ఖాళీగా ఉంచకుండా తాత్కాలిక అధ్యక్షుడిని నియమించాలని ఆయన సూచించారు. ఆ తర్వాత పార్టీ ప్రెసిడెంట్పదవికి ఎన్నికలు నిర్వహించాలని అన్నారు. ప్రెసిడెంట్పదవితో పాటు పార్టీలో కీలక పదవులకూ అంతర్గత ఎన్నికలు నిర్వహించాలని చెప్పారు. పార్టీలో బాధ్యతాయుత వాతావరణం ఏర్పడాలని రాహుల్గాంధీ చెబుతున్నారని, కార్యకర్తల ఓట్లతో పార్టీ పగ్గాలు చేపట్టిన వ్యక్తి మరింత బాధ్యతాయుతంగా ఉంటారని శశిథరూర్ చెప్పారు. ఈమేరకు ఈ నెల 10న సీడబ్ల్యూసీ సమావేశం అవుతుందని పార్టీ ప్రకటించిన వెంటనే శశిథరూర్ స్పందించారు. ఈ మీటింగ్లో పార్టీకి తాత్కాలిక అధ్యక్షుడిని ఎన్నుకోవాలని కోరారు.
