హైదరాబాద్, వెలుగు: అఖిల భారత ప్రాథమిక ఉపాధ్యాయ సమాఖ్య (ఏఐపీటీఎఫ్) దక్షిణ భారత దేశ కోఆర్డినేటర్గా తెలంగాణకు చెందిన సయ్యద్ షౌకత్అలీ నియమితులయ్యారు. దక్షిణాది రాష్ట్రాల అనుబంధ సంఘాల వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ఆయన్ను కోఆర్డినేటర్గా నియమిస్తూ ఫెడరేషన్జాతీయ అధ్యక్షుడు సుశీల్ కుమార్ పాండే బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాబోయే మూడేండ్ల పాటు ఆయన ఈ బాధ్యతల్లో కొనసాగనున్నారు. సౌత్ ఇండియా కోఆర్డినేటర్ హోదాలో ఆయన తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని ఉపాధ్యాయ సంఘాల వ్యవహారాలను పర్యవేక్షించనున్నారు. ప్రస్తుతం ఆయన టీఎస్ పీటీఏ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
