రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ..షీ టీమ్స్ ఏఎస్సై మృతి

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ..షీ టీమ్స్ ఏఎస్సై మృతి

ఎల్​బీనగర్, వెలుగు : రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ షీ టీమ్స్ ఏఎస్సై రాజేంద్ర నాథ్ రెడ్డి హాస్పిటల్​లో ట్రీట్​మెంట్ తీసుకుంటూ ఆదివారం మృతి చెందారు. 1993వ బ్యాచ్​కు చెందిన రాజేంద్రనాథ్​ రెడ్డి కొంతకాలంగా ఎల్​బీనగర్  డివిజన్ షీ టీమ్స్ ఇన్​చార్జిగా విధులు నిర్వర్తిస్తున్నారు. గత నెల 11న ఎల్ బీనగర్ నుంచి ఉప్పల్ వైపు వెళ్తుండగా.. నాగోల్ ఫ్లై ఓవర్ పై ఆయన బైక్ స్కిడ్ కావడంతో రోడ్డుపై పడిపోయారు.

రాజేంద్రనాథ్​ తలకు తీవ్ర గాయాలు కాగా.. చైతన్యపురి ఇన్ స్పెక్టర్ నాగార్జున సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని హాస్పిటల్​కు తరలించారు. వారం రోజులుగా హాస్పిటల్​లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న రాజేంద్రనాథ్ రెడ్డిని మెరుగైన వైద్యం కోసం కుటుంబసభ్యులు సిటీ న్యూరో హాస్పిటల్​​లో అడ్మిట్ చేశారు. అక్కడ ట్రీట్​మెంట్ తీసుకుంటూ ఆదివారం ఆయన చనిపోయారు. రాజేంద్రనాథ్​ మృతిపై ఉన్నతాధికారులు సంతాపం తెలిపారు.