షీలా ఫోమ్​ చేతికి కుర్లోన్​

షీలా ఫోమ్​ చేతికి కుర్లోన్​

ముంబై: పరుపుల తయారీ రంగంలోని షీలా ఫోమ్​ లిమిటెడ్​ మరో పరుపుల తయారీ కంపెనీ కుర్లోన్​ ఎంటర్​ప్రైజస్​ లిమిటెడ్​ను కొనుగోలు చేయనుంది. రూ. 3,250 కోట్ల నగదు చెల్లింపుతో కుర్లోన్​ ఎంటర్​ప్రైజస్​లో నూరు శాతం వాటా చేజిక్కించుకోనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రెండు నెలల్లో ఈ డీల్ పూర్తవుతుందని ఆ వర్గాలు వెల్లడించాయి. తాజా డీల్​ వల్ల పరుపుల  మార్కెట్లో షీలా ఫోమ్​ వాటా డబులై 35–40 శాతానికి చేరుతుందని నిపుణులు చెబుతున్నారు.

 స్లీప్​వెల్​, ఫెదర్​ ఫోమ్​, ప్యూర్​ పీయూ ఫోమ్​, లామిఫ్లెక్స్​ వంటి బ్రాండ్​ పేర్లతో షీలా ఫోమ్​ తన ప్రొడక్టులను అమ్ముతోంది. ఈ కంపెనీకి నార్త్​, వెస్ట్​ ప్రాంతాలలో గట్టి పట్టుండగా, కుర్లోన్​ ఎంటర్​ప్రైజస్​కు సౌత్​, ఈస్ట్ ​ ప్రాంతాలలో అమ్మకాలు ఎక్కువగా ఉంటున్నాయి. దేశంలోని మోడర్న్​ మ్యాట్రెసెస్​ మార్కెట్లో 40 శాతం వాటా మాత్రమే బ్రాండెడ్​ ప్లేయర్ల చేతిలో ఉంది.