న్యూఢిల్లీ: పేటీఎం బదులుగా ఇతర పేమెంట్ ఆప్షన్లు ఎంచుకోవాలని వ్యాపారులకు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సెయిట్) సూచించింది. ‘ రిజర్వ్ బ్యాంక్ చర్యల వలన మా మెంబర్లు జాగ్రత్తలు తీసుకోవాలని సలహా ఇస్తున్నాం.
ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లలో అంతరాయం ఏర్పడకుండా ఉండేందుకు, తమ ఫండ్స్ను రక్షించుకునేందుకు ఇతర పేమెంట్ ఆప్షన్లకు షిఫ్ట్ అవ్వాలని సూచిస్తున్నాం’ అని సెయిట్ వెల్లడించింది.