
కాలికట్: ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) నాలుగో సీజన్ వేలంలో హైదరాబాద్ బ్లాక్హాక్స్ జట్టు కీలక ప్లేయర్లను సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన వేలంలో ప్లాటినం కేటగిరీ నుంచి శిఖర్ సింగ్ను రూ.16 లక్షల భారీ మొత్తంతో కొనుగోలు చేసి టీమ్ను బలోపేతం చేసుకుంది. అమన్ కుమార్ను రూ.11.5 లక్షలకు, దీపు వేణుగోపాల్ను రూ.5.75 లక్షలకు తమ జట్టులో చేర్చుకుంది.
ఈ ముగ్గురి రాకతో రాబోయే సీజన్లో హైదరాబాద్ బ్లాక్హాక్స్ పటిష్టంగా మారనుంది. ఇక, వేలంలో అందరి దృష్టిని ఆకర్షించిన జెరోమ్ వినీత్ను చెన్నై బ్లిట్జ్ జట్టు రికార్డు స్థాయిలో రూ.22.5 లక్షల ధరకు కొనుగోలు చేసింది.
కాలికట్ హీరోస్ లోకల్ ప్లేయర్ షమీముద్దీన్ను, కొచ్చి బ్లూ స్పైకర్స్ వినీత్ కుమార్ను కూడా చెరో రూ.22.5 లక్షలకు కొనుగోలు చేశాయి. కొచ్చి టీమ్ జస్జోధ్ సింగ్ను రూ.14.75 లక్షలకు, బెంగళూరు టార్పెడోస్ జిష్ణు పీవీని రూ.14 లక్షలకు దక్కించుకున్నాయి