AP సర్కార్ కు హైకోర్టులో ఊరట

AP సర్కార్ కు హైకోర్టులో ఊరట

AP సర్కార్ కు ఆ రాష్ట్ర హైకోర్టులో ఊరట దక్కింది. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నిర్భందిస్తూ శనివారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ జారీ చేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. పెద్దిరెడ్డిని హౌస్ అరెస్ట్ చేయాలన్న ఎస్ఈసీ ఆదేశాలు చెల్లవని తీర్పు చెప్పింది. నిమ్మగడ్డ రమేష్ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ పెద్దిరెడ్డి దాఖలు చేసిన లంచ్  మోషన్ పిటిషన్ పై ఇవాళ విచారించింది హైకోర్టు. పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న టైమ్ లో రాష్ట్రంలో పర్యటించాల్సిన బాధ్యత ఆ శాఖ మంత్రిగా తనపై ఉందని పిటిషనర్ తరపు లాయర్ల వాదనలతో కోర్టు ఏకీభవించింది.