అమెరికాలో కాల్పులు..నలుగురు మృతి

అమెరికాలో కాల్పులు..నలుగురు మృతి

మరోసారి కాల్పులతో అమెరికా దద్దరిల్లింది. ఆదివారం సాయంత్రం ఇండియానా మాల్లోని ఫుడ్ కోర్డులో దుండగుడు కాల్పులు జరిపాడు. రైఫిల్తో విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో గన్ మెన్తో సహా నలుగురు మృతి చెందగా... ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ సమయంలో మరో వ్యక్తి దుండగుడిపై కాల్పులు జరిపాడని..అతను కూడా మరణించినట్లు స్థానిక అధికారులు తెలిపారు  కాల్పులపై సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు..మాల్లో తనిఖీలు నిర్వహించారు. బాత్రూమ్లో అనుమానాస్పదంగా బ్యాగ్ కనిపించినట్లు వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు. 

అమెరికాలో కాల్పుల ఘటనలు తరచూ జరుగుతున్నాయి.  గ‌న్ వ‌యొలెన్స్ ఆర్కివ్ నివేదిక ప్రకారం అమెరికాలో  కాల్పుల వల్ల ఏడాదికి 40వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నెల 4న కూడా చికాగోలో ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 7 మంది ప్రాణాలు కోల్పోయారు. 35 మంది గాయాలపాలయ్యారు. 

మరోవైపు అమెరికాలో కాల్పుల ఘటనలు రోజు రోజుకు పెరిగిపోతుండటంతో గన్ నియంత్రణ చట్టాన్ని తీసుకువస్తున్నట్లు అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. దీని ప్రకారం 18-21 ఏళ్ల మధ్య వయసున్న వారు గన్స్ కొనుగోలు చేయకుండా చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టంతో ఎవరి హక్కులకు భంగం కలగదని  ప్రజల రక్షణ కోసమే చట్టాన్ని తీసుకువస్తున్నట్లు బైడెన్​ చెప్పారు.