పల్లెల అభివృద్ధికి సమష్టి కృషి చేయాలి : ఆర్డీ డైరెక్టర్శ్రుతిఓజా

పల్లెల అభివృద్ధికి సమష్టి కృషి చేయాలి :  ఆర్డీ డైరెక్టర్శ్రుతిఓజా
  • పీఆర్, ఆర్డీ డైరెక్టర్​గా బాధ్యతల స్వీకరించిన శ్రుతి ఓజా

హైదరాబాద్, వెలుగు: పల్లెల అభివృద్ధికి సమష్టిగా పనిచేయాలని పీఆర్, ఆర్డీ డైరెక్టర్​శ్రుతిఓజా తెలిపారు. బుధవారం ఖైరతాబాద్​లోని ఆనంద్​నగర్ కాలనీలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనరేట్​లో డైరెక్టర్​గా ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, సిబ్బంది శ్రుతి ఓజాకు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె ప్రస్తుతం విమెన్​అండ్ చైల్డ్​వెల్ఫేర్​డైరెక్టర్​గా పనిచేస్తున్నారు. ఇటీవల జరిగిన బదిలీల్లో ఆమెకు పీఆర్, ఆర్డీ డైరెక్టర్​గా అదనపు బాధ్యతలు అప్పగించారు.