
ఇండోర్ వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతోన్న మూడో వన్డే మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ శుభ్మన్ గిల్ సెంచరీ బాదాడు. 72బంతుల్లోనే గిల్ సెంచరీ సాధించాడు. గిల్ ఇన్నింగ్స్ లో మొత్తం 13 ఫోర్లు, 4 సిక్సులున్నాయి. గిల్ కు ఇది వన్డేల్లో 5 సెంచరీ కావడం విశేషం. ప్రస్తుతం టీమిండియా 26 ఓవర్లకు గానూ 212 పరుగులు చేసింది. రోహిత్ (101 ), గిల్ (103) పరుగులతో క్రీజులో ఉన్నారు.