నకిలీ విత్తనాలు అమ్మేవారిపై పీడీ యాక్ట్ కేసు

నకిలీ విత్తనాలు అమ్మేవారిపై పీడీ యాక్ట్ కేసు

నార్కట్​పల్లి, వెలుగు : ఎవరైనా నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని ఎస్ఐ అంతిరెడ్డి  హెచ్చరించారు. బుధవారం నార్కట్​పల్లి రైతు వేదికలో నకిలీ విత్తనాల నిర్మూలనపై వ్యవసాయ, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో డీలర్లకు అవగాహన కల్పించారు. 

ఈ సందర్భంగా నకిరేకల్ వ్యవసాయశాఖ సహాయ సంచాలకుడు రామారావు నాయక్, ఎస్ఐ మాట్లాడుతూ వానాకాలంలో విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల అమ్మకంలో డీలర్లు ప్రభుత్వ నిబంధనలు పాటించాలన్నారు. డీలర్లు లైసెన్స్​లేకుండా వ్యాపారం ప్రారంభించరాదని, అమ్మినటువంటి విత్తనాలు, ఎరువుల వివరాలను రిజిస్టర్ లో నమోదు చేయాలని తెలిపారు.