
సిద్దిపేట రూరల్, వెలుగు: శాంతి భద్రతల పరిరక్షణ కోసమే సిద్దిపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన వన్ టౌన్ సీఐ వాసుదేవరావు, టూ టౌన్ సీఐ ఉపేందర్, స్పెషల్ పార్టీ పోలీసులతో కలసి సిద్దిపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాజిత్ పుర, కరీంనగర్ రోడ్, అంబేద్కర్ నగర్, సంజీవయ్య నగర్ ప్రదేశాలలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. ఎవరు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దని, ఏదైనా సంఘటన జరిగే అవకాశం ఉంటే వెంటనే డయల్ 100, సిద్దిపేట పోలీస్ కంట్రోల్ రూమ్ 8712667100 లకు కాల్ చేసి సమాచారం అందించాలని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దని ఏది నిజం, ఏది అబద్ధమో తెలుసుకున్న తర్వాతనే పోస్ట్ చేయాలని సూచించారు.