
- కారణాలతో సహా దరఖాస్తుల వివరాలను వెల్లడించాలి
- అధికారులను ఆదేశించిన కలెక్టర్ హైమావతి
సిద్దిపేట టౌన్, వెలుగు: ప్రజావాణి దరఖాస్తులు ఎందుకు పెండింగ్ ఉన్నాయని, శాఖల వారీగా మే 31 వరకు ఉన్న పెండింగ్ దరఖాస్తుల వివరాలను తెలియజేయాలని కలెక్టర్ హైమావతి ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం సిద్దిపేట కలెక్టర్ ఆఫీస్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు గరిమ అగర్వాల్, అబ్దుల్ హమీద్ తో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమానికి 98 దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి దరఖాస్తుల డిస్పోజల్ వివరాలను ఆన్లైన్లో పొందుపరచాలన్నారు.
ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ప్రారంభానికి ముందు దరఖాస్తుల పరిష్కార వివరాలపై జిల్లా అధికారులతో సమీక్షిస్తానని, గత వారం స్వీకరించిన దరఖాస్తుల పరిష్కారానికి తీసుకున్న చర్యలు, పూర్తి రిపోర్టుతో హాజరు కావాలన్నారు. అత్యవసర పరిస్థితి ఉంటే మాత్రమే ప్రజావాణి రోజు సెలవు మంజూరు చేస్తానని, తన అనుమతి లేకుండా ఎవరూ సెలవు పెట్టరాదన్నారు. జిల్లాలో ప్రతి ఒక్క ప్రభుత్వశాఖ కార్యక్రమాల ప్రగతిపై 15 రోజులకు ఒకసారి సమీక్ష నిర్వహిస్తానని జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి అధికారులు అందరూ హాజరుకావాలన్నారు. ఈనెల 21న జిల్లా కేంద్రంలో నిర్వహించే యోగా దినోత్సవంలో అధికారులందరూ తప్పక పాల్గొనాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్వో నాగరాజమ్మ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
సమస్యలను సత్వరమే పరిష్కరించాలి : కలెక్టర్ ప్రావీణ్య
సంగారెడ్డి టౌన్: ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులకు సూచించారు. సంగారెడ్డి కలెక్టరేట్లో అధికారులతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కలెక్టర్మాట్లాడుతూ.. ప్రజావాణికి 63 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. వాటిలో రెవెన్యూ 15, పౌర సరఫరాల శాఖ 2, మార్క్ ఫెడ్1, సర్వే ల్యాండ్ 9, పంచాయతీ అండ్పీటీ విభాగం 4, పంచాయతీ రాజ్ 2,డీఆర్డీవో 4, మున్సిపల్ 9, వెల్ఫేర్ డిపార్ట్మెంట్10, విద్యాశాఖ 2, జిల్లా యువజన శాఖ 1, వ్యవసాయ శాఖ నుంచి 4 వినతులు వచ్చాయన్నారు. అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్మాట్లాడుతూ జిల్లాలో ఏర్పడిన సమస్యల గురించి ఆయా శాఖల అధికారులు వెంటనే తనకు సమాచారం అందించాలన్నారు. ఆయా శాఖల్లో పెండింగ్ ఫైళ్లను వెంటనే క్లియర్ చేయాలని సూచించారు. త్వరలో వివిధ శాఖల వారీగా సమీక్ష నిర్వహిస్తానని, అధికారులు పూర్తి సమాచారంతో హాజరుకావాలని ఆదేశించారు. అధికారులు జిల్లాలో పర్యటనలకు వెళ్లినప్పుడు ఆయా ప్రాంతాలకు సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, డీఆర్వో పద్మజా రాణి, ఆర్డీవోలు, వివిధ శాఖలఅధికారులు పాల్గొన్నారు.
ప్రజావాణి ఫిర్యాదులపై నిర్లక్ష్యం చేయొద్దు: కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్ టౌన్: ప్రజావాణి ఫిర్యాదులపై అధికారులు నిర్లక్ష్యం చేయొద్దని, తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్రాహుల్రాజ్ఆదేశించారు. మెదక్కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్నగేశ్తో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ..ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 85 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. వాటిలో భూ సమస్యలు -36, పెన్షన్లు 2, ఇందిరమ్మ ఇళ్లు 17, ఇతర సమస్యలు 30 ఉన్నట్లు పేర్కొన్నారు. మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని తప్పనిసరిగా నిర్వహించాలని, అందుకు తగ్గట్లుగా ప్రచారం చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఆర్డీవో శ్రీనివాస్రావు, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.