![అక్రమ మట్టి రవాణాపై పోలీసుల దాడులు](https://static.v6velugu.com/uploads/2024/05/siddipet-task-force-police-conducted-raids-on-illegal-soil-transport_uloU8mhY30.jpg)
- జేసీబీతో పాటు 9 ట్రాక్టర్లు స్వాధీనం
కోహెడ, వెలుగు: అక్రమ మట్టి రవాణాపై సిద్దిపేట టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. మండలంలోని కూరెల్ల పెద్ద చెరువు నుంచి అనుమతులు లేకుండా రాత్రిపూట తిప్పారపు నవీన్కు చెందిన ఇటుక బట్టీలకు నల్ల మట్టి తరలిస్తున్నరనే సమాచారంతో స్థానిక పోలీసులతో కలిసి రైడ్ చేశారు.
ఈ దాడుల్లో జేసీబీతో పాటు 9 ట్రాక్టర్లను పట్టుకొని పీఎస్కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.