
- కేదార్నాథ్ లో సిద్దిపేట రుచులు
రుద్రప్రయాగ్: చార్ ధామ్ యాత్రలో భాగంగా జ్యో తిర్లింగ క్షేత్రం కేదార్నాథ్ ఆలయానికి భక్తులుపో టెత్తారు. నిన్న ( మే 2) ఒక్కరోజే రికార్డు స్థాయిలో 30 వేల మందికి పైగా మంజునాథుడిని దర్శించుకున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రం నుంచి కేదార్ నాథ్ వెళ్లే టూరిస్టులకు శుభవార్త. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి జ్యోతిర్లింగ క్షేత్రానికి చేరుకున్న వారి కోసం సిద్దిపేటకు చెందిన సేవా సమితి ఫ్రీగా మూడు పూటలా భోజన సౌకర్యం కల్పిస్తోంది. నిత్యం టీ, టిఫిన్లు, మధ్యాహ్నం లంచ్.. సాయంత్రం స్నాక్స్.. రాత్రి భోజనం వరకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా భక్తులకు అందిస్తోంది.
ఉత్తరాఖండ్ సో స్ ప్రయాగ్ సమీపంలో శిరైషి రాంపూర్ మధ్యఒక శిబిరం.. కేదార్ నాథ్ ఆలయానికి 100 అడుగుల దూరంలో మరో శిబిరాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఇక్కడ సభ్యులతోపాటు మరో 60 మంది సిబ్బంది నిత్యం వివిధ షిష్ట్లలో పని చేస్తుంటారు. ఈ అన్నదాన శిబిరంలో అల్పాహారం, భోజనంతో పాటు రాత్రి పూట విశ్రాంతి తీసుకునేందుకు 100 మందికి వసతి కూడా కల్పిస్తోంది. అంతేకాకుండా కేదార్ నాథ్ వెళ్లిన వారు సాయం పొందేందుకు ఫోన్ సంబర్లను కూడా కేటాయించారు. 9949930005, 9246932267, 9848124031, 9440777741 సంబర్లకు ఫోన్ చేసి కేదార్నాథ్ అన్నదాన సేవా సమితి సేవలను పొందవచ్చు.
Also Read : లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే
ఎలా చేరుకోవాలి
కేదార్నాథ్ సన్నిధికి చేరుకోవాలంటే ఓ సాహసమేనని చెప్పాలి. ఉత్తరాఖండ్ రాష్ట్రం సోన్ ప్రయాగ్ వరకు వాహనాల్లో వెళ్లొచ్చు. ఆ తర్వాత సుమారు 5 కిలోమీటర్ల మేర గౌరీముండ్ వరకు ప్రత్యేక వాహనాలు ఉంటాయి. అక్కడి నుంచి మరో 21 కిలోమీటర్ల దూరం కాలినడకన, డోలీలు, గుర్రాలు, ఇతర రూపాల్లో స్వామివారి సన్నిధికి చేరుకోవాల్సి ఉంటుంది. కేదార్ నాథ్ దర్శించుకునే మొత్తం యాత్రికుల్లో 60 శాతం మేర భక్తులు దక్షిణ భారతదేశం నుంచి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు