
న్యూఢిల్లీ: సీమెన్స్ లిమిటెడ్ ఎనర్జీ వ్యాపారం విడిపోయిన తర్వాత సిమెన్స్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ (ఎస్ఈఐఎల్) షేర్లు గురువారం స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయ్యాయి. సీమెన్స్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ స్టాక్ బీఎస్ఈలో రూ.2,850 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది.
తరువాత, అది ప్రారంభ ధర నుంచి 5 శాతం ర్యాలీ చేసి రూ.2,992.45 అప్పర్ సర్క్యూట్ను తాకింది. తరువాత సంస్థ షేర్లు 3.92 శాతం తగ్గి రూ.2,738.35 వద్ద ముగిశాయి. ఎన్ఎస్ఈలో షేర్లు రూ.2,840 వద్ద ప్రారంభమయ్యాయి. తరువాత 5 శాతం పెరిగి ఇంట్రా-డే ట్రేడింగ్లో రూ.2,982 అప్పర్ సర్క్యూట్ సర్క్యూట్ను తాకాయి. చివరికి స్టాక్ రూ.3.69 శాతం నష్టంతో రూ.2,735 వద్ద ముగిశాయి.
కంపెనీ మార్కెట్ విలువ రూ.97,518.26 కోట్లుగా ఉంది. సీమెన్స్ లిమిటెడ్ తన ఇంధన వ్యాపారాన్ని ప్రత్యేక సంస్థగా విభజించడానికి తమ బోర్డు డిసెంబర్ 2023లో ఆమోదం తెలిపిందని పేర్కొంది.