విద్యార్థుల సామర్థ్యాల పెంపునకు కృషి చేయాలి : డైరెక్టర్ విజయలక్ష్మి

విద్యార్థుల సామర్థ్యాల పెంపునకు కృషి చేయాలి :  డైరెక్టర్ విజయలక్ష్మి
  • ఎస్​ఐఈటీ డైరెక్టర్​ విజయలక్ష్మి

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు :  విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల పెంపుదలకు టీచర్లు కృషి చేయాలని ఎస్​ఐఈటీ డైరెక్టర్​ విజయలక్ష్మి బాయి సూచించారు. గురువారం జిల్లాలో ఆమె పర్యటించి కొత్తగూడెంలోని మండల వనరుల కేంద్రంలో ఎంఈఓలు, స్కూల్​ కాంప్లెక్స్​ హెచ్​ఎంలు, కేజీబీవీ స్పెషల్​ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు. యూడైస్​ ప్లస్, అపార్​ జనరేషన్, స్టూడెంట్స్, టీచర్స్​ ఎఫ్​ఆర్​ఎస్, యూనిఫాం పంపిణీ లాంటి విషయాలపై సమీక్షించారు.

 ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నారులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత టీచర్లపైనే ఉందన్నారు. గవర్నమెంట్​ స్కూళ్లను బలోపేతం చేయడంలో టీచర్ల కృషి కీలకమని చెప్పారు. ఈ ప్రోగ్రాంలో డీఈవో నాగలక్ష్మి, విద్యాశాఖ కో ఆర్డినేటర్లు నాగరాజశేఖర్​, జె.అన్నమణి, ఎస్​కె. సైదులు, ఎన్. సతీశ్​కుమార్​ పాల్గొన్నారు.