
- నాలుగు నెలలుగా నిర్వహించని బోర్డు
- వారసుల ఏజ్ అయిపోతుందంటూ కార్మికుల్లో బెంగ
- ఆందోళనలకు సిద్ధమవుతున్న కార్మిక సంఘాలు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగరేణిలో నాలుగు నెలలుగా మెడికల్బోర్డు నిలిచిపోవడంతో కార్మికుల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు తమ వారసుల ఏజ్అయిపోతుందనే బెంగ పట్టుకుంది. బోర్డు ఎప్పుడు నిర్వహిస్తారోనని వేలాది మంది కార్మికులు ఎదురు చూస్తున్నారు. రెగ్యులర్గా బోర్డు నిర్వహించాలనే డిమాండ్ తో కార్మిక సంఘాలు ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి. సింగరేణిలో కారుణ్య నియామకాల(డిపెండెంట్ఎంప్లాయ్ మెంట్) కింద కార్మికుల వారసులకు ఉద్యోగాలను మెడికల్ సర్టిఫికెట్ ద్వారానే కల్పిస్తుంది.
ఒక్కసారి బోర్డు ఏర్పాటు చేస్తే..
2018 నుంచి మెడికల్ బోర్డును ప్రారంభించగా.. ఇప్పటివరకు 118 బోర్డులు నిర్వహించారు. ఇందులో దాదాపు13,500 మంది కార్మికుల వారసులకు డిపెండెంట్ఎంప్లాయ్ మెంట్కింద జాబ్ లు కల్పించారు. గతంలోనైతే ప్రతి నెలకోసారి బోర్డు నిర్వహించేది. ఏదేని కారణాలతో ఏర్పాటు చేయకుంటే ఆ తర్వాత నెలలో రెండు బోర్డులను ఏర్పాటు చేసేది. ఒక్కసారి బోర్డు ఏర్పాటు చేస్తే.. 150 మంది నుంచి 200 మంది కార్మికులను మేనేజ్ మెంట్ పిలుస్తుంది. ఇందులో 75 మంది నుంచి120 మందికి పైగా అన్ఫిట్అవుతుండడం సర్వసాధారణం. కాగా నాలుగు నెలలుగా బోర్డు నిర్వహించకపో వడంతో పాటు యాజమాన్యం కూడా స్పష్టత ఇవ్వకపోవడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ వారసుల ఏజ్ అయిపోతుందనే బెంగలో ఉన్నారు. 40 ఏండ్లు దాటితే వారసులకు అన్ఫిట్ద్వారా జాబ్ లు దక్కవని పేర్కొంటున్నారు.
అన్ఫిట్చేసేందుకు రూ. లక్షల్లో వసూలు
మెడికల్బోర్డు అవినీతిమయంగా మారిందనే తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. అనారోగ్యంతో బాధపడే కార్మికులు ఇక తాము పని చేయలేమని, వారసులకు డిపెండెంట్ జాబ్ లు కల్పించాలని మెడికల్బోర్డుకు దరఖాస్తు పెట్టుకుంటారు. రెండేండ్ల సర్వీస్ఉన్నవారికి తొలి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది. కొత్తగూడెంలోని సింగరేణి మెయిన్ఆస్పత్రిలో మెడికల్బోర్డు ఇంటర్వ్యూలు, హెల్త్చెకప్జరుగుతుంటాయి. బోర్డులో సింగరేణి ఆస్పత్రి డాక్టర్లతో పాటు బయటి డాక్టర్లు, కొందరు ఆఫీసర్లు, యూనియన్ల లీడర్లు, దళారులు అన్ఫిట్చేయిస్తామంటూ పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నట్టు, ఒక్కొక్కరి వద్ద రూ. 6 లక్షల నుంచి రూ. 8ల వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉంటున్నాయి.
బోర్డు ప్రక్షాళనపై డైరెక్టర్ ఫోకస్
దశాబ్దాకాలం తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ ను సింగరేణి డైరెక్టర్ పర్సనల్ అండ్వెల్ఫేర్(పా) పోస్టులో ప్రభుత్వం నియమించింది. ఇటీవల ఐఏఎస్ గౌతమ్ పొట్రు బాధ్యతలు తీసుకున్నారు. మెడికల్బోర్టుపై దృష్టి పెట్టి పెట్టారు. చీఫ్ మెడికల్ఆఫీసర్ద్వారా వివరాలు తెలుసుకుని.. అక్రమ వసూళ్ల ఆరోపణలపైనా విచారించారు. పారదర్శకతతో కూడిన బోర్డు నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించారు. ఇటీవలి పెండింగ్లోని రెఫరల్ కేసులకు బోర్డు నిర్వహించి 54 మందిని పిలిచారు. వీరిలో ఐదుగురుని మాత్రమే అన్ఫిట్చేశారు. ఎలాంటి ప్రలోభాలకు తావు లేకుండా ఈ ప్రక్రియ పూర్తి చేశారు. ఇంత తక్కువగా అన్ ఫిట్ చేయడంతో కార్మికుల్లో కొంత ఆందోళన నెలకొంది.
దళారులకు చెక్ పడేనా..
గత మార్చిలో అప్పటి సింగరేణి సీఎంఓపై సింగరేణి విజిలెన్స్అధికారులు విచారణ చేపట్టారు. ఆ తర్వాత నుంచే మెడికల్బోర్డు నిర్వహణను సింగరేణి ఆపేసింది. కొందరు యూనియన్లీడర్లు, అధికారులు దళారులతో అక్రమ దందా చేస్తున్నారనే తీవ్ర ఆరోపణలు వచ్చాయి. హైదరాబాద్ నుంచి వచ్చే స్పెషలిస్ట్డాక్టర్ల వివరాలను ముందే తెలుసుకొని దళారులు బేరసారాలు సాగించిన దాఖలాలున్నాయి. మరోవైపు బోర్డుపై ఏసీబీ, సీఐడీ ఆఫీసర్లతో పాటు విజిలెన్స్నిఘా ఉందంటూ అన్ఫిట్కావాలంటే రూ. 10 లక్షలు ఇవ్వాలంటూ దళారులు కొత్తగా దందాకు తెరతీయడం గమనార్హం. ఇకముందు 2 నుంచి 3 ఏండ్ల సర్వీస్ ఉన్న వారిలో దరఖాస్తు చేసుకున్న కార్మికులకే బోర్డు నిర్వహించి, అన్ఫిట్చేసి దశలవారీగా కారుణ్య నియామకాలు కల్పిస్తే బోర్డులో అవినీతిని అరికట్టే అవకాశాలు ఉన్నాయి.
త్వరలో బోర్డు నిర్వహిస్తాం
త్వరలో మెడికల్బోర్డును నిర్వహిస్తాం. పారదర్శకతతో పాటు అర్హులైన వారికే అన్ఫిట్సర్టిఫికెట్ ఉంటుందనేది కార్మికులు గుర్తుంచుకోవాలి. మేనేజ్ మెంట్ నుంచి ఆదేశాలు రాగానే మెడికల్బోర్డును నిర్వహిస్తాం. దళారుల మాటలను నమ్మి కార్మికులు మోసపోవద్దు.
- కిరణ్రాజ్ కుమార్, సీఎంఓ, సింగరేణి-