ఆధునిక కాలంలో సిమ్ కార్డులతో జరుగుతున్న మోసాలను అరికట్టేందుకు మోడీ ప్రభుత్వం సిమ్ డీలర్లకు పోలీసు వెరిఫికేషన్ను తప్పనిసరి చేసింది. దీనితో పాటు బల్క్ కనెక్షన్లను కూడా నిలిపివేసింది. కేంద్రం కొత్త రూల్స్ వల్ల మోసాలకు అడ్డు కట్ట పడే అవకాశం ఉంది. ఇకపై సిమ్ కార్డు డీలర్లపై డేగ కన్ను ఉండనుంది.కేంద్రం కొత్త రూల్స్ తీసుకువచ్చింది. సిమ్ కార్డుకు సంబంధించి కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. భారీ జరిమానా, పోలీసుల ఎంట్రీ వంటివి ఉండనున్నాయి.
కొత్త సిమ్కార్డుల జారీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సిమ్కార్డులను విక్రయించే డీలర్లకు పోలీస్ వెరిఫికేషన్ను తప్పనిసరని టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. నకిలీ సిమ్కార్డుల అమ్మకానికి, ఒకే వ్యక్తిపై ఎక్కువ సిమ్ల విక్రయాలకు అడ్డుకట్టపడడంతో పాటు సిమ్ స్పామింగ్ను సైతం తగ్గిస్తుందన్నారు. ఇప్పటి వరకు 52లక్షల మొబైల్ కనెక్షన్లు మూసివేయగా.. 67వేల మంది డీలర్లను బ్లాక్ లిస్టులో పెట్టినట్లు కేంద్రం తెలిపింది.
రూ. 10 లక్షల జరిమానా..
సిమ్ కార్డ్ డీలర్లందరికి పోలీసు వెరిఫికేషన్ అండ్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ తప్పనిసరి అని కేంద్ర టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే రూ. 10 లక్షల జరిమానా విధిస్తామని కూడా ప్రకటించారు. సంచార్ సాథి పోర్టల్ను ప్రారంభించినప్పటి నుంచి సుమారు 52 లక్షల మోసపూరిత కనెక్షన్లను ప్రభుత్వం గుర్తించి వాటిని డీయాక్టివేట్ చేసినట్లు వైష్ణవ్ వెల్లడించారు. ప్రస్తుతం దేశంలోని సిమ్కార్డు డీలర్లు అందరూ తప్పనిసరిగా పోలీస్ వెరిఫికేషన్ చేయించుకోవాల్నారు. అలాగే షాప్ కోసం కేవైసీని సైతం చేయాల్సి ఉంటుంది.ఈ ఏడాది మే నుంచి సిమ్కార్డు డీలర్లపై దాదాపు 300 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. నకిలీ సిమ్కార్డుల రాకెట్లో పాల్గొన్న 66వేల వాట్సాప్ అకౌంట్లను సైతం బ్లాక్ అయ్యాయి.
ఒకే ఆధార్పై 658 సిమ్కార్డులు..
దేశంలో నిత్యం ఎక్కడో చోట సిమ్కార్డు మోసాలు వెలుగు చూస్తున్నాయి. తమిళనాడులోని సైబర్ క్రైమ్ వింగ్ ఈ వారంలో ఓ వ్యక్తి ఆధార్ నంబర్పై ఉన్న 100నుంచి150 సిమ్కార్డులను స్వాధీనం చేసుకున్నది.నాలుగు నెలల్లో తమిళనాడులోని సైబర్ క్రైమ్ వింగ్ రాష్ట్రవ్యాప్తంగా 25 వేల 135 సిమ్ కార్డులను మోసపూరిత కార్యకలాపాలకు వినియోగిస్తున్నట్లుగా అనుమానిస్తూ వాటిని బ్లాక్ చేసింది.
ఒకే ఫొటోతో 658 సిమ్ కార్డులు
ఏపీలోని విజయవాడలో ఒకే ఫొటోతో ఓ యువకుడు పొందినట్లు 658 సిమ్కార్డులు ఏఐ టెక్నాలజీతో పోలీసులు గుర్తించారు. ఆయా సిమ్లన్నింటిని బ్లాక్ చేయాలని బ్లాక్ చేయాలని టెలికాం కంపెనీని పోలీసులు ఆదేశించారు. టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ కూడా బల్క్ కనెక్షన్ల సదుపాయాన్ని నిలిపివేసిందని, బదులుగా బిజినెస్ కనెక్షన్ అనే కొత్త కాన్సెప్ట్ను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో మోసపూరిత కాల్స్ పూర్తిగా అరికట్టడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.