
ఒడెన్స్ : ఇండియా స్టార్ షట్లర్ పీవీ సింధు డెన్మార్క్ ఓపెనర్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్ చేరుకుంది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్లో సింధు 18–21, 21–15, 21–13తో ఏడో ర్యాంకర్ జార్జియా మరిస్కా తుంజుంగ్ (ఇండోనేసియా)ను ఓడించి ముందంజ వేసింది. మరో మ్యాచ్లో ఆకర్శి కశ్యప్ 18–21, 8–21తో సుపదినా కటెతాంగ్ (థాయ్లాండ్) చేతిలో వరుస గేమ్స్లో ఓడి ఇంటిదారి పట్టింది.