
సింగపూర్: గాయాల నుంచి కోలుకున్న ఇండియా డబుల్స్ స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ షెట్టి సింగపూర్ ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్తో తిరిగి బరిలో దిగనున్నారు. మంగళవారం మొదలయ్యే మెగా టోర్నీలో ఇండియా సవాల్ను ముందుండి నడపించనున్నారు. మార్చిలో జరిగిన ఆల్ ఇంగ్లండ్ చాంపియన్షిప్లో ఈ జోడీ చివరిసారి బరిలోకి దిగింది. ఆ టోర్నీలో చిరాగ్ వెన్ను గాయం కారణంగా రెండో రౌండ్లో తప్పుకోగా..ఆ తర్వాత సాత్విక్ అనారోగ్యంతో ఆటకు దూరమయ్యాడు.
రెండు నెలల తర్వాత తిరిగొస్తున్న ఈ జంట తొలి రౌండ్లో మలేసియాకు చెందిన చూంగ్ హోన్ జియాన్– ముహమ్మద్ హైకల్లతో తలపడనుంది. సింగిల్స్లో హెచ్.ఎస్. ప్రణయ్ డెన్మార్క్కు చెందిన రాస్మస్ గెమ్కేతో తన తొలి మ్యాచ్ ఆడనున్నాడు. లక్ష్య సేన్.. లిన్ చున్-యితో తలపడనున్నాడు. విమెన్స్ సింగిల్స్లో నిరాశపరుస్తున్న పీవీ సింధు ఈ టోర్నీతో అయినా ఫామ్ అందుకోవాలని చూస్తోంది.
తను కెనడాకు చెందిన వెన్ యూ జాంగ్తో తొలి రౌండ్లో పోటీపడనుంది. యంగ్ షట్లర్లు ప్రియాన్షు రాజవత్, కిరణ్ జార్జ్తో పాటు విమెన్స్ డబుల్స్లో ట్రీసా జాలీ–పుల్లెల గాయత్రి, మిక్స్డ్ డబుల్స్లో ధ్రువ్ కపిల–తనీషా క్రాస్టో, రోహన్ కపూర్–రుత్విక శివాని జోడీలు కూడా అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.