సింగరేణిలో బెస్ట్ ఉద్యోగులు వీరే... ఇయ్యాల ( ఆగస్టు 15 ) కొత్తగూడెంలో సన్మానించనున్న సీఎండీ

సింగరేణిలో బెస్ట్ ఉద్యోగులు వీరే... ఇయ్యాల ( ఆగస్టు 15 ) కొత్తగూడెంలో సన్మానించనున్న సీఎండీ

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: సింగరేణిలో బెస్ట్​ఉద్యోగులను యాజమాన్యం ఎంపిక చేసింది. స్వాతంత్ర్య  వేడుకల సందర్భంగా ఏటా ప్రతి ఏరియా నుంచి ఒక్కొక్కరి చొప్పున బెస్ట్​ఉద్యోగులను ఎంపిక చేసి యాజమాన్యం సన్మానిస్తుంది.  ఇందులో భాగంగా ఈసారి ఎంపికైన బెస్ట్​ఉద్యోగుల వివరాలను జనరల్ మేనేజర్ (వెల్ఫేర్) జీవీ కిరణ్​కుమార్​గురువారం ప్రకటించారు. 

భూపాలపల్లి ఏరియా కేటీకే–1 ఇంక్లైన్​కు చెందిన ఎం. మురళి (ట్రామర్), ఆర్జీ–3 ఏరియాకు చెందిన కె. కృష్ణ (ఈపీ ఆపరేటర్), అడ్రియాలకు చెందిన ఎన్. మల్లేశ్​మల్టీ (జాబ్​వర్కర్)​, ఆర్జీ–2కు చెందిన జె. లక్ష్మయ్య(ఈపీ ఆపరేటర్), ఆర్జీ–1 ఏరియాకు చెందిన ఆర్. లక్ష్మీనారాయణ(ఈపీ ఆపరేటర్), బెల్లంపల్లి ఏరియా గోలేటీ సీహెచ్​పీకి చెందిన రాంకిషన్(ఈపీహెల్పర్), మందమర్రి ఏరియా కాశీపేట్​కు చెందిన పి. అంకులు (కోల్​కట్టర్), శ్రీరాంపూర్​ ఏరియాకు చెందిన ఎ. మధుసూదనరావు (ఫోర్​మెన్).  

మణుగూరు ఏరియా పీకే ఓసీ–2కు చెందిన ఎ. ఆంజనేయులు(ఈపీ ఆపరేటర్), కొత్తగూడెం ఏరియా పీవీకే–5 ఇంక్లైన్​కు చెందిన బి.కుమారస్వామి (టెండాల్), ఎస్టీపీపీకి చెందిన జె. పర్సయ్య (సీనియర్​అసిస్టెంట్), కార్పొరేట్ ఆఫీసుకు చెందిన జి. వెంకటరావు (సీనియర్​లా ఆఫీసర్) బెస్ట్​ఎంప్లాయీస్ గా సెలెక్ట్ అయ్యారు. కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో శుక్రవారం స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా కంపెనీ సీఎండీ ఎన్​. బలరాంతో పాటు డైరెక్టర్లు సన్మానించనున్నట్టు ఆయన వివరించారు.