సింగరేణి డిస్మిస్డ్​ కార్మిక సంఘం స్టేట్​ ప్రెసిడెంట్​ రవీందర్​ మృతి

సింగరేణి డిస్మిస్డ్​ కార్మిక సంఘం స్టేట్​ ప్రెసిడెంట్​ రవీందర్​ మృతి
  • అనారోగ్యంతో హైదరాబాద్ గాంధీలో కన్నుమూత

కోల్​బెల్ట్, వెలుగు : సింగరేణి డిస్మిస్డ్  కార్మిక సంఘం స్టేట్​ ప్రెసిడెంట్  బీరబోయిన రవీందర్​(55) అనారోగ్యంతో గురువారం మృతి చెందారు. ఆయన కొద్ది కాలంగా ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్నారు. హైదరాబాద్​ లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మంచిర్యాల జిల్లా  మందమర్రిలోని యాపల్​ సీఎస్పీ రోడ్​ ఏరియాకు చెందిన రవీందర్..  సింగరేణి డిస్మిస్డ్  కార్మికులకు తిరిగి ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్​ చేస్తూ ఉద్యమాలు చేస్తున్నారు.

డిస్మిస్డ్​ కార్మిక సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు రామిల్ల రాయలింగు చనిపోయిన తర్వాత రవీందర్​ 2014 ఫిబ్రవరి 9 నుంచి సంఘానికి స్టేట్​ ప్రెసిడెంట్​గా వ్యవహరిస్తున్నారు. మందమర్రి సింగరేణి జీఎం ఆఫీసు సమీపంలో ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ ఆయన ఆధ్వర్యంలో డిస్మిస్డ్​ కార్మికులు 7,136 రోజులుగా రిలే దీక్ష శిబిరం నిర్వహిస్తున్నారు. సుమారు నెల రోజుల కిందట రవీందర్​ సోదరుడు కుమారస్వామి అనారోగ్యంతో చనిపోయాడు. కాగా, రవీందర్  కూడా డిస్మిస్డ్​ కార్మికుడే. ఆయన మృతిపై కాంగ్రెస్​ లీడర్​ రామిల్ల రాధికతో పాటు కార్మిక, రాజకీయ పార్టీలు  సంతాపం ప్రకటించాయి. డిస్మిస్డ్ ​ కార్మికుల కోసం రవీందర్  తన జీవితకాలం పోరాటం చేశారని పలువురు గుర్తుచేసుకున్నారు.