సింగరేణిలో సెక్టార్‌‌‌‌ 3 స్కూల్‌‌లో సీబీఎస్‌‌ఈ సిలబస్‌‌ : శ్రీనివాస్

సింగరేణిలో సెక్టార్‌‌‌‌ 3 స్కూల్‌‌లో సీబీఎస్‌‌ఈ  సిలబస్‌‌ : శ్రీనివాస్

గోదావరిఖని, వెలుగు: సింగరేణిలో మొట్టమొదటి సారిగా యైటింక్లయిన్​ కాలనీలోని సెక్టార్​ 3 హైస్కూల్​లో ఈ విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్‌‌ఈ సిలబస్‌‌ను ప్రారంభించనున్నట్లు అడ్మిషన్లు చేపడుతున్నామని సింగరేణి ఎడ్యుకేషన్​ సొసైటీ సెక్రటరీ గుండా శ్రీనివాస్​ తెలిపారు. 

సోమవారం హైస్కూల్​లో నిర్వహించిన స్క్రీనింగ్‌‌ టెస్ట్‌‌ను పరిశీలించారు. అంతకుముందు గోదావరిఖనిలోని సింగరేణి సెక్టార్​ హైస్కూల్​ను సందర్శించారు. ఆయన వెంట పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, ఫారెస్ట్ డీజీఎం కర్ణ, పీవో హనుమంత రావు, సివిల్ సూపర్​వైజర్ రాంచందర్ ఉన్నారు.