
గోదావరిఖని, వెలుగు: సింగరేణిలో మొట్టమొదటి సారిగా యైటింక్లయిన్ కాలనీలోని సెక్టార్ 3 హైస్కూల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్ఈ సిలబస్ను ప్రారంభించనున్నట్లు అడ్మిషన్లు చేపడుతున్నామని సింగరేణి ఎడ్యుకేషన్ సొసైటీ సెక్రటరీ గుండా శ్రీనివాస్ తెలిపారు.
సోమవారం హైస్కూల్లో నిర్వహించిన స్క్రీనింగ్ టెస్ట్ను పరిశీలించారు. అంతకుముందు గోదావరిఖనిలోని సింగరేణి సెక్టార్ హైస్కూల్ను సందర్శించారు. ఆయన వెంట పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, ఫారెస్ట్ డీజీఎం కర్ణ, పీవో హనుమంత రావు, సివిల్ సూపర్వైజర్ రాంచందర్ ఉన్నారు.