సింగరేణి ఎన్నికలు.. ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొంటున్న కార్మికులు

సింగరేణి ఎన్నికలు.. ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొంటున్న కార్మికులు

సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 7గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 5  గంటలకు వరకు జరగనుంది.  మొత్తం 84 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. ఎన్నికల విధుల్లో 700 మంది సిబ్బంది పాల్గొన్నారు.  తమ ఓటు హక్కు వినియోగించుునేందుకు కార్మికులు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.  చాలా ఉత్సాహంగా ఓటింగ్  లో పాల్గొంటున్నారు. 

మణుగూరు సింగరేణి ఏరియాలో ఉదయం 8 గంటల వరకు13.1% పోలింగ్ శాతం నమోదైంది.  ఈరోజు ఫస్ట్ షిఫ్ట్ కార్మికులు మధ్యాహ్నం మూడు గంటలకు విధులు పూర్తిచేసుకుని తమ ఓటును వినియోగించుకోనున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

ఎనిమిది కౌంటింగ్‌‌‌‌  కేంద్రాల్లో రాత్రి7 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 9వేల కు పైగా ఓటర్లు ఉన్న శ్రీరాంపూర్​ నుంచి తుదిఫలితం వస్తుంది.   ఈ ఎన్నికల్లో సీపీఐ అనుబంధ ఏఐటీయూసీ, కాంగ్రెస్ అనుబంధ ఐఎన్​టీయూసీ నడుమ హోరాహోరీ పోటీ  నడువనుంది.  ఈ రెండు యూనియన్లకు బలమైన క్యాడర్ ఉండడం, మాతృపార్టీల లీడర్లు ముమ్మర ప్రచారం నిర్వహించడంతో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.