
గోదావరిఖని, వెలుగు : అమెరికాలో గుండెపోటుతో సింగరేణి ఎంప్లాయ్ చనిపోయాడు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పవర్హౌస్కాలనీకి చెందిన పెరుక ప్రకాశ్(55), సింగరేణి రామగుండం ఏరియా ఆర్జీ –-3 డివిజన్ఓపెన్కాస్ట్-–2 ప్రాజెక్ట్లో జనరల్అసిస్టెంట్. కాగా ప్రకాశ్ దంపతులు కొద్దిరోజుల కింద అమెరికాలోని ఆస్టిన్సిటీలో ఉండే కూతురు వద్దకు వెళ్లారు.
అక్కడ ఈనెల 25న ఉదయం ప్రకాశ్ వాకింగ్చేస్తూ గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయినట్టు కుటుంబసభ్యులు సోమవారం తెలిపారు. ఈనెల 31న ఆయన డెడ్ బాడీని గోదావరిఖనికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.