కొప్పులను నిలదీసిన సింగరేణి కార్మికులు

కొప్పులను నిలదీసిన సింగరేణి కార్మికులు

మాజీ మంత్రి, బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కు నిరసన సెగ తగిలింది. రామగుండం సింగరేణి ఏరియా గోదావరిఖని 1వ బొగ్గు గనిపై ఎన్నికల ప్రచారానికి వెళ్లారు కొప్పుల. కార్మికులను కలిసి ఓట్లు అడిగేందుకు వెళ్లిన కొప్పులను సమస్యలపై నిలదీశారు మహిళా కార్మికులు.

సింగరేణిలో మహిళా కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు సమస్యలు ఎందుకు పరిష్కరించలేదని ప్రశ్నించారు. సమస్యలు పరిష్కరించకుండా మళ్ళీ ఎలా ఓట్లు ఆడిగేందుకు వచ్చారని నిలదీశారు. దీంతో అక్కడి నుంచి వెనుదిరిగారు కొప్పుల ఈశ్వర్.

పెద్దపల్లి బీఆర్ఎస్  ఎంపీ అభ్యర్థిగా కొప్పల ఈశ్వర్, కాంగ్రెస్ నుంచి గడ్డం వంశీ కృష్ణ పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి గోమాస శ్రీనివాస్ పోటీ  చేస్తున్న సంగతి తెలిసిందే.