నాణ్యతమైన బొగ్గు ఉత్పత్తికి ప్రాధాన్యత ఇవ్వాలి : సింగరేణి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకన్న

నాణ్యతమైన బొగ్గు ఉత్పత్తికి ప్రాధాన్యత ఇవ్వాలి : సింగరేణి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకన్న
  • సింగరేణి ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్​ వెంకన్న

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : వినియోగదారులకు అవసరమైన విధంగా నాణ్యతతో కూడిన బొగ్గు ఉత్పత్తి చేసే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సింగరేణి ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్​, చీఫ్​ విజిలెన్స్​ ఆఫీసర్​ బదావత్​ వెంకన్న పేర్కొన్నారు. కంపెనీ డైరెక్టర్​ ప్రాజెక్టు, ప్లానింగ్​ కొప్పుల వెంకటేశ్వర్లుతో కలిసి కొత్తగూడెం ఏరియాలోని పీవీకే–5 ఇంక్లైన్​ మైన్​ ఆయన సందర్శించారు. అనంతరం వీకే ఓసీలో బొగ్గు ఉత్పత్తిని సమీక్షించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీవీకే–5 ఇంక్లైన్​ అండర్​ గ్రౌండ్​ మైన్​ నుంచి రోజూ 1000 టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసేలా ప్లాన్​ చేసుకోవాలన్నారు. వీకే ఓసీలో త్వరిత గతిన బొగ్గు ఉత్పత్తి చేయాలని సూచించారు. బొగ్గు ఉత్పత్తిలో రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ ప్రోగ్రాంలో ఏరియా జీఎం షాలెం రాజు, ఎస్వోటూజీఎం కోటిరెడ్డి, ఆఫీసర్లు కె. సూర్యనారాయణ రాజు, రామకృష్ణ, నరసింహరావు, శ్యాంప్రసాద్​, సత్యనారాయణ రాజు పాల్గొన్నారు.