సోలార్ పవర్ నిల్వకు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ : సింగరేణి డైరెక్టర్ కె.వెంకటేశ్వర్లు

సోలార్ పవర్ నిల్వకు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ : సింగరేణి డైరెక్టర్ కె.వెంకటేశ్వర్లు
  • సింగరేణి డైరెక్టర్(పీపీ) కె.వెంకటేశ్వర్లు

కోల్​బెల్ట్, వెలుగు: సోలార్ పవర్​ను నిల్వ చేసి సద్వినియోగం చేసుకునే వినూత్న ఆవిష్కరణకు సింగరేణి శ్రీకారం చుట్టిందని, ఇందుకు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్​ సిస్టం ఏర్పాటు చేసిందని సింగరేణి డైరెక్టర్ (ప్రాజెక్ట్​ అండ్ ​ప్లానింగ్) కె.వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం ఆయన మందమర్రి ఏరియాలో పర్యటించారు. 

మందమర్రిలోని ప్రాణహితకాలనీ వద్ద ఉన్న 28 మెగావాట్ల సోలార్​పవర్ ​ప్లాంట్​లోని బ్యాటరీ ఎనర్జీస్టోరేజ్ ​సిస్టంను ఏరియా జీఎం ఎన్.రాధాకృష్ణతో కలిసి  పరిశీలించారు. మెగావాట్ కెపాసిటీ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్​పద్ధతిలో పవర్ నిల్వ చేసే తీరును పరిశీలించారు.​ 

అనంతరం ఏరియా జీఎం ఆఫీస్​లో ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. కేకే ఓసీపీలోని వ్యూపాయింట్ వద్దకు వెళ్లి బొగ్గు ఉత్పత్తి, ఓబీ వెలికితీత, బొగ్గు రవాణా తీరును పరిశీలించారు. డైరెక్టర్​వెంట ఏరియా జీఎం రాధాకృష్ణ, ఓసీపీ పీవో మల్లయ్య, ఏరియా ఇంజనీర్​ బాలాజీ భగవత్​ఝూ, మేనేజర్ రామరాజు, ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ ​రవికుమార్​ తదితరులు పాల్గొన్నారు.