కోల్బెల్ట్,వెలుగు: సింగరేణి కార్మికులకు 11వ వేజ్బోర్డు ఈనెల నుంచే అమల్లోకి రానుంది. జూలైలో కార్మికులు కొత్త వేతనాలు అందుకోనున్నారు. 11వ వేజ్బోర్డు అగ్రిమెంట్పై కేంద్ర బొగ్గు గనులశాఖ మంత్రి ప్రహ్లద్జోషి సోమవారం సంతకం చేశారు. ఈనెల 21న కోలిండియా నుంచి సర్క్యులర్ వచ్చే అవకాశం ఉంది. సర్క్యులర్ రాగానే సింగరేణిలోని 42 వేల మంది కార్మికులకు 11వ వేజ్బోర్డు ప్రకారం వేతనాలు ఇస్తారు. గతనెల జరిగిన 11వ వేజ్బోర్డుమీటింగ్లో 19శాతం మినిమమ్ గ్యారంటీ బెనిఫిట్, 25శాతం ఇతర అలవెన్సులు కలిపి కొత్త వేతనాలను ఖరారు చేశారు.
ఒకటో కేటగిరీ కార్మికుడు 26 రోజుల పాటు పనిచేస్తే ఇప్పుడు రూ.26,293 వస్తుండగా కొత్త వేతనం ప్రకారం రూ.39,069 అందనున్నాయి. వేతనం దాదాపు రూ.12,776 పెరుగుతుంది. 10వ వేజ్బోర్డులో ఏడీఏ రోజుకు రూ.18.15 ఉండగా, ప్రస్తుతం రూ.26.97కు పెంచారు. 11వ వేజ్బోర్డ్ అమలు వల్ల సింగరేణిపై నెలకు రూ.70కోట్ల వరకు భారం పడనుంది. జులై 3న సింగరేణి కార్మికులు కొత్త వేతనం అందుకుంటారని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి, జేబీసీసీఐ మెంబర్ వాసిరెడ్డి సీతారామయ్య, బీఎంఎస్ స్టేట్ ప్రెసిడెంట్ యాదగిరి సత్తయ్య తెలిపారు.
