![సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి నేత్ర దానం](https://static.v6velugu.com/uploads/2024/05/singareni-retired-employee-pothunuri-satyanarayana-eye-donation-in-srirampur-colony_Ksm3DegEyF.jpg)
నస్పూర్, వెలుగు: శ్రీరాంపూర్ కాలనీకి చెందిన పోతునూరి సత్యనారాయణ సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి శుక్రవారం చనిపోవడంతో.. అతని కండ్లను కుటుంబీకులు దానం చేశారు. సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేత్రాలను సేకరించారు.
ఈ కండ్లతో ఇద్దరికి చూపు వస్తుందని ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు. నేత్రదానానికి సహకరించిన సత్యనారాయణ కొడుకు శ్రీనివాస్, కోడలు స్నేహలతకు కృతజ్ఞతలు తెలిపారు.