- వీరంతా గ్రామీణ ప్రాంతాల్లో ఉండటమే కారణం
- ఫలితమివ్వని సీఎంపీఎఫ్క్యాంపులు
- మొబైల్క్యాంపులు పెట్టాలని రిటైర్డ్ ఉద్యోగుల డిమాండ్
కోల్బెల్ట్, వెలుగు : సింగరేణివ్యాప్తంగా వేలాది మంది రిటైర్డు ఉద్యోగులు, కుటుంబసభ్యులకు పింఛన్ నిలిచిపోయింది. ఇందుకు లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించకపోవడమే కారణమని తేలింది. రామగుండం సీఎంపీఎఫ్కమిషనర్ఆఫీస్పరిధిలో ఎంతమందికి పింఛన్లు చెల్లిస్తున్నారనే వివరాలపై ఇటీవల సింగరేణి రిటైర్డు ఎంప్లాయీస్వెల్ఫేర్అసోసియేషన్స్టేట్డిప్యూటీ జనరల్సెక్రటరీ ఆళవందార్వేణుమాధవ్ఆర్టీఐ కింద వివరాలు కోరారు.
కాగా.. ఈ ఏడాదిలో10,490 మంది రిటైర్డు ఉద్యోగులు లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించలేదని సీఎంపీఎఫ్ఆఫీసర్లు వెల్లడించారు. సాధారణంగా పెన్షన్ పొందేందుకు రిటైర్డు కార్మికులు, కుటుంబీకులు ఏటా నవంబర్లోపు లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించాలి. వీటిని ఆఫ్లైన్లో లేదా ఆన్లైన్లోనూ అందించాల్సి ఉంటుంది.
అయినా వేలాది మంది లైఫ్ సర్టిఫికెట్లు సకాలంలో ఇవ్వకపోవడంతో పింఛన్నిలిచిపోయింది. ఇందుకు మారుమూల పల్లెల్లో ఇంటర్నెట్ సెంటర్లలో అవగాహన లేక ఆర్గనైజేషన్, పేయింగ్ అథారిటీ, బ్యాంకు ఖాతా, పెన్షన్ పేమెంట్ ఆర్డర్ సరిగా నింపకపోవడంతో పాటు తప్పులు దొర్లడంతో మరికొందరు పింఛన్కు దూరమయ్యారు.
క్యాంపులతో అంతంతే..
సింగరేణిలోని గోలేటీ నుంచి భూపాలపల్లి వరకు ఉన్న బొగ్గు గనులు రామగుండం సీఎంపీఎఫ్కమిషనర్ఆఫీస్పరిధిలోకి వస్తాయి. ఏటా నవంబర్లో లైఫ్ సర్టిఫికెట్లు ఇవ్వడంలో జాప్యం కారణంగా భారీగా రిటైర్డు ఉద్యోగులు, కుటుంబీకులు పింఛన్ పొందకపోవడాన్ని గుర్తించిన రామగుండం సీఎంపీఎఫ్ ఆఫీసర్లు నేరుగా సింగరేణివ్యాప్తంగా ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేయించారు.
సీఎంపీఎఫ్సంస్థ భవిష్యత్ లో పింఛనర్లు మరణించినా, వారి భాగస్వాములకు సకాలం లో పింఛను అందించేందుకు డిజిటల్లైఫ్సర్టిఫికెట్ల(డీఎల్సీ)4.0 విధానాన్ని ప్రవేశపెట్టింది. దీనిపై అవగాహన కల్పించేం దుకు గత నవంబర్3 నుంచి 28 తేదీ వరకు ఆఫీసర్లు వివిధ ఏరియాల్లో లైఫ్సర్టిఫికెట్లు ఆన్లైన్చేసే ప్రక్రియను చేపట్టారు. దీనికి పెన్షన్దారుల నుంచి పెద్దగా స్పందనరాలేదు.
దూరప్రాంతాల్లో ఉండడంతోనే.
సింగరేణిలో గతంలో పనిచేసిన వారంతా దాదాపు నిరక్షరాస్యులు కావడం, రిటైర్అయిన తర్వాత చాలామంది అనారోగ్యం బారినపడడం, కుటుంబ సభ్యులు సైతం గుర్తుంచుకోలేకపోవడం వంటి సమస్యలతో ఏటా నవంబర్లో పింఛన్ కోసం లైఫ్ సర్టిఫికెట్లు ఇవ్వలేకపోతున్నారు. రిటైర్డు అయిన తర్వాత ఉద్యోగులు దూరప్రాంతాల్లోని సొంతూరుల్లోకి వెళ్లడం, వృద్ధాప్యం వల్ల సర్టిఫికెట్ ఇవ్వాలనే సమాచారం తెలుసుకోలేకపోతున్నారు.
దీనికి తోడు సింగరేణిలోని మైన్లు/డిపార్ట్మెంట్ల నుంచి కూడా సరైన సమాచారం ఇవ్వడం లేదని పలువురు పెన్షనర్లు పేర్కొంటున్నారు. ప్రతి ఏటా నవంబర్లో లైఫ్ సర్టిఫికెట్లను సమర్పించేందుకు సీఎంపీఎఫ్ ఆఫీసర్లు మొబైల్ క్యాంపులను ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఉద్యోగులు పేర్కొంటున్నారు. జమ్మికుంట, పరకాల, కరీంనగర్ తదితర ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేచాలని సూచిస్తున్నారు. దీంతో పాటు సింగరేణి మెడికల్ ఫెసిలిటీకార్డు రెన్యూవల్ సౌకర్యం కల్పిస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.
జనవరి వరకు చాన్స్ఇవ్వాలి
సింగరేణి రిటైర్డు ఉద్యోగులు, కుటుంబీకులకు లైఫ్ సర్టిఫికెట్లు సమర్పణకు వచ్చే జనవరి వరకు చాన్స్ ఇవ్వాలి. చాలామంది గ్రామాల్లో ఉండడం, మరిచిపోవడం వంటి కారణాలతో సకాలంలో సర్టిఫికెట్లు అందించలేకపోయారు. దూరప్రాంతాల్లోని వారికి సీఎంపీఎఫ్ఆఫీసర్లు మొబైల్క్యాంపు సేవలను అందించాలి. అక్కడే సీపీఆర్ఎంఎస్ మెడికల్ కార్డ్రెన్యూవల్ చేసుకునే సౌకర్యం కల్పించాలి. ఇందుకు సీఎంపీఎంఫ్, సింగరేణి చొరవ చూపాలి. - వేణుమాధవ్, సింగరేణి రిటైర్డు ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ
మూడు దశాబ్దాలుగా సవరించలేదు
బొగ్గు గని కార్మికుల పింఛను సవరించకపోవడంతో పాత విధానంలోనే లబ్ధి పొందుతున్నారు. మార్కెట్సూచీ, ధరల ప్రకారం ప్రతి మూడేండ్లకు ఒకసారి రిటైర్డు ఉద్యోగులకు చెల్లిస్తున్న పెన్షన్ సవరించాలి. కానీ, 1995 లో ప్రవేశపెట్టిన పింఛనును మూడు దశాబ్ధాలుగా చెల్లిస్తున్నారు. దీంతో రూ.1000 లోపు పింఛను పొందుతున్న రిటైర్డు ఉద్యోగులు కూడా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆసరా పెన్షన్ అంత కూడా రిటైర్డు ఉద్యోగులకు అందడంలేదు.
పెన్షన్పెంచాలని ఏండ్లుగా ఉద్యమిస్తున్నా ఫలితం లేదు. దీంతో అరకొర పెన్షన్ కోసం వందల్లో ఖర్చు చేసి లైఫ్సర్టిఫికెట్ల దరఖాస్తుకు రిటైర్డు ఉద్యోగులు ఆసక్తి చూపకపోవడం ఒక కారణంగా ఉంది. సింగరేణిలో ప్రస్తుతం 82,387 మంది రిటైర్డు ఉద్యోగులున్నారు. వీరికి ప్రతి నెల రూ.80కోట్ల పెన్షన్ చెల్లిస్తున్నారు. తక్కువ పెన్షన్పొందుతున్నవారు 8,349 మంది ఉన్నారు. వీరు 30 – 35ఏండ్ల పాటు భూగర్భ గనుల్లో పనిచేసిన రిటైర్డు ఉద్యోగులకు పెన్షన్గా దక్కేది రూ.1000లోపే కావడం గమనార్హం.
