నేషనల్​ మాస్టర్స్ గేమ్స్​లో .. సింగరేణి రిటైర్డు ఉద్యోగులకు గోల్డ్​ మెడల్స్​

నేషనల్​ మాస్టర్స్ గేమ్స్​లో .. సింగరేణి రిటైర్డు ఉద్యోగులకు గోల్డ్​ మెడల్స్​

కోల్​బెల్ట్​, వెలుగు: హైదరాబాద్​లోని ఎల్​బీ  స్టేడియంలో ఈనెల 22,23, 24 న పాన్​ ఇండియా మాస్టర్స్​ గేమ్స్​  ఆధ్వర్యంలో ​ ఫస్ట్​ ఫెడరేషన్​ కప్​ నేషనల్​ మాస్టర్స్​ గేమ్స్​-2024లో సింగరేణి రిటైర్డు ఉద్యోగులు సత్తా చాటి పలు పతకాలు దక్కించుకున్నారు. తెలంగాణ తరుపున రామకృష్ణాపూర్​కు చెందిన రిటైర్డు సింగరేణి ఉద్యోగి శఠగోపం కిష్టయ్య 85 ఏళ్లపైబడిన విభాగంలో పలు  క్రీడల్లో పోటీపడ్డారు.

 100 మీటర్ల రన్నింగ్​, హ్యమ్మర్​ త్రో, షాట్​ఫుట్​, జావెన్​త్రో, డిస్కాస్​త్రోలో  గోల్డ్​మోడల్స్​ దక్కించుకున్నాడు.  రిటైర్డు ఉద్యోగి మాడిపెల్లి రాజకోమురయ్య 69ఏళ్ల విభాగం  3 కి.మీ వాకింగ్​లో రెండో స్థానంతో సిల్వర్​ మెడల్​ సాధించాడు.