
మందమర్రి, వెలుగు: మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా సింగరేణి సెక్యూరిటీ ఉద్యోగి ఒకరు జాబ్ఇప్పిస్తానంటూ నిరుద్యోగుల నుంచి రూ. అర కోటి వరకు వసూలు చేశాడు. చివరకు మోసపోయామని గుర్తించిన బాధితులు శుక్రవారం సింగరేణి ఆఫీస్ వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామకృష్ణాపూర్ కు చెందిన కోల మహేశ్వర్రావు మందమర్రి ఏరియా సింగరేణి సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. సింగరేణి డైరెక్టర్లు, పలువురు జీఎంలతో పరిచయం ఉందని, ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగులను నమ్మించాడు. ప్రైవేటు సెక్యూరిటీ గార్డు జాబ్ అంటూ ఒక్కొక్కరి నుంచి రూ.1.6 లక్షల చొప్పున మంచిర్యాల జిల్లా జైపూర్, మందమర్రి, నస్పూర్, కాసీపేట మండలాలకు చెందిన పది మంది నుంచి రూ.16.9 లక్షలు వరకు వసూలు చేశాడు. డెల్టా సెక్యూరిటీ ఫోర్స్ అండ్ సెక్యూరిటీ కన్సల్టెంట్ పేరుతో ఫేక్ఐడీ కార్డులు ఇచ్చి జూన్ నుంచి వీరికి మంచిర్యాల బైపాస్ రోడ్డులో పెట్రోలింగ్ డ్యూటీ అప్పగించాడు. సెక్యూరిటీ యూనిఫాం ఇచ్చి జనసంచారం లేనిచోట డ్యూటీ చేయాలని చెప్పాడు. వారికి అనుమానం రాకుండా రెండు, మూడు రోజులకోసారి వెళ్లి తనిఖీల పేరిట పుస్తకంలో సంతకం పెట్టి వచ్చేవాడు. స్క్రాప్లారీలను గమనించాలంటూ పురమాయించాడు. ఒకరిద్దరికి మందమర్రి ఏరియాలోని మైన్లపై కూడా డ్యూటీ వేశాడు. జూన్, జూలైలో డ్యూటీ చేసినందుకు ఒక్కొక్కరికి రూ.9 వేల నుంచి రూ.13 వేల వరకు జీతాలు ఇచ్చాడు. పర్మినెంట్ సింగరేణి సెక్యూరిటీ గార్డుల పేరుతో కొందరు యువకులకు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్పరీక్షలు చేయించాడు. ఎక్కువమొత్తం చెల్లించినవారికి పరీక్షలు లేకుండా సర్టిఫికెట్లు ఇప్పించాడు. జూలై నెలలో సింగరేణి డైరెక్టర్(పర్సనల్) పేరుతో మందమర్రి ఏరియా సింగరేణి జీఎంకు జారీ చేసినట్లుగా పర్మినెంటు సింగరేణి సెక్యూరిటీ గార్డులుగా ఫేక్ జాయినింగ్లెటర్లు ఇచ్చాడు. పర్మినెంటు చేయడానికి మొత్తంగా ఒక్కొక్కరి నుంచి రూ.5.5 లక్షల వరకు దండుకున్నాడు. బాధితులు గణేశ్, శివశంకర్వరప్రసాద్అక్కలైన వందన, తిరుమలకు సింగరేణి జూనియర్అసిస్టెంట్పోస్టులు ఇప్పిస్తానని రూ.6 లక్షల చొప్పున వసూలు చేశాడు. పర్మినెంట్అయినప్పటికీ మస్టర్లు వేసుకోవడానికి ఆఫీస్కు వెళ్లకపోవడం, ఆఫీసర్లను పరిచయం చేయకపోవడంతో అనుమానం వచ్చిన బాధితులు శుక్రవారం మందమర్రి సింగరేణి ఎస్అండ్పీసీ ఆఫీస్కు వెళ్లి ఆరా తీశారు. ఫేక్ ఉద్యోగాలు కల్పించి కోల మహేశ్వర్ తమను మోసం చేశాడని గుర్తించి ఆందోళనకు దిగారు. మహేశ్వర్రావుపై చర్య తీసుకోవాలని సింగరేణి సీనియర్సె క్యూరిటీ ఆఫీసర్ రవికి ఫిర్యాదు చేశారు.
జైలు నుంచి విడుదలైనా మారలే
క్యాతన్పల్లి, నస్పూర్లో రియల్ఎస్టేట్బిజినెస్పేరుతో పలువురు వద్ద డబ్బులు వసూలు చేసి స్థలాలు రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో కోల మహేశ్వర్రావుపై కేసులు నమోదయ్యాయి. 2019 ఫిబ్రవరిలో ధర్మపురి మండలం ఆరెపల్లికి చెందిన జిల్లపల్లి సాగర్, సింగరేణి ఆఫీసర్ వద్ద డ్రైవర్గా పనిచేసే యువకుడు, సింగరేణి కార్మికుడి కొడుకు, షిర్కేకు చెందిన ఇద్దరు మహిళలతో పాటు పలువురి వద్ద రూ.50 లక్షలకు పైగా తీసుకొని మోసం చేశాడు. దీంతో అతనిపై మంచిర్యాల, సీసీసీ నస్పూర్, మందమర్రి పోలీస్స్టేషన్లలో 2019 నుంచి 2021 జూన్ వరకు పలు కేసులు నమోదు చేశారు. 19 జులై 2021న పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపించారు. జైలు నుంచి విడుదలైన మహేశ్వర్రావు తిరిగి ఏప్రిల్2022లో సింగరేణి డ్యూటీలో చేరాడు. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను నమ్మించి మోసం చేశాడు.