గోదావరి పరివాహక ప్రాంత బొగ్గు బ్లాక్ లకు సింగరేణికే కేటాయించాలి : డిప్యూటీ సీఎం భట్టి

 గోదావరి పరివాహక ప్రాంత బొగ్గు బ్లాక్ లకు సింగరేణికే కేటాయించాలి : డిప్యూటీ సీఎం భట్టి

 తెలంగాణ బొగ్గు బ్లాక్ లను ప్రైవేట్ సంస్థలకు కేటాయించటం బాధాకరన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రధాని మోదీతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేకంగా మాట్లాడి సింగరేణికి న్యాయం చేయాలని సూచించారు. రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి సింగరేణిని కాపాడుదామన్నారు.  ప్రధాని మోదీ సమయం తీసుకుంటే.. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్తామని చెప్పారు.  

తెలంగాణ ప్రాంత బిడ్డగా రాష్ట్రానికి న్యాయం చేసే బాధ్యత కిషన్ రెడ్డిపై ఉందన్నారు. తెలంగాణలో విద్యుత్ వినియోగం పెరిగిందని చెప్పారు. సింగరేణి సంస్థ బ్రతకాలంటే కొత్తగా గనులు కేటాయించటం అవసరమన్నారు. ప్రైవేట్ సంస్థలకు కేటాయించిన సత్తుపల్లి, కొయ్యగూడెం బ్లాక్ లను సింగరేణికి కేటాయించాలని కోరారు. 

ఇందుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. గోదావరి పరివాహక ప్రాంత బొగ్గు బ్లాక్ లకు సింగరేణికే కేటాయించాలని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పు వలన సింగరేణి నష్టపోయిందన్నారు.