- ఏడేండ్లకు చెందిన రూ. 63 కోట్లు చెల్లించనున్న యాజమాన్యం
- గత రెండేండ్ల పాత బకాయిలు కూడా ఇవ్వాలని కోరుతున్న ఆఫీసర్లు
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: ఏడేండ్ల పీఆర్సీ బకాయిలు చెల్లించేందుకు గురువారం సింగరేణి ఓకే చెప్పింది. ఇందుకు కోల్మైన్స్ఆఫీసర్స్అసోసియేషన్ఆఫ్ఇండియా (సీఎంఓఏఐ)కు సమాచారం ఇచ్చింది. బొగ్గు పరిశ్రమల్లోని ఆఫీసర్లకు పెర్ఫార్మెన్స్రిలేటెడ్పే (పీఆర్పీ) చెల్లించేందుకు కోల్ఇండియాతో పాటు సింగరేణి ముందుకొచ్చింది. సంస్థలు లాభాల్లోకి రావడంలో ఆఫీసర్లు కీలక పాత్ర పోషిస్తుండగా.. జీతంతో సంబంధం లేకుండా కొంత ఇస్తే మరింత ఉత్సాహంగా పనిచేస్తారని యాజమాన్యాలు భావించాయి. 2007–08 ఆర్థిక సంవత్సరం నుంచి చెల్లించేందుకు అగ్రిమెంట్ చేసుకోగా.. ప్రభుత్వాలతో సరైన చర్చలు లేక, ఇతరత్రా కారణాలతో చెల్లింపులు లేట్ అయ్యాయి.
2007–08 నుంచి 2013–14 వరకు బకాయిలు పేరుకుపోయాయి. దీంతో సీఎంఓఏఐ తరఫున పలువురు హైకోర్టును ఆశ్రయించగా.. బకాయిలు చెల్లించాలని ఆదేశాలిచ్చినా యాజమాన్యాలు లేట్ చేశాయి. పలుమార్లు ఆఫీసర్లు కూడా యాజమాన్యాన్ని కోరగా.. ఏడేండ్ల బకాయిలు రూ. 63 కోట్లు చెల్లించనున్నట్టు సింగరేణి నిర్ణయించింది. దీంతో ఆఫీసర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు 2022–23, 2023–24 ఆర్థిక సంవత్సరాల్లోని దాదాపు రూ. 117 కోట్లు పీఆర్పీ చెల్లించాల్సి ఉంది.
వీటిని కూడా చెల్లించాలని డిమాండ్చేస్తూ ఇటీవలి సీఎంఓఏఐ ఆధ్వర్యంలో ఆఫీసర్లు కొత్తగూడెంలోని హెడ్డాఫీస్ఎదుట ధర్నా చేశారు. పీఆర్పీ బకాయిలు చెల్లించేందుకు సింగరేణి ముందుకు రావడం పట్ల సీఏఓఎఐ సింగరేణి అధ్యక్షుడు టి. లక్ష్మీపతి గౌడ్హర్షం వ్యక్తం చేశారు. సీఎండీ ఎన్. బలరామ్కు యూనియన్తరఫున కృతజ్ఞతలు తెలిపారు. గత రెండు ఆర్థిక సంవత్సరాలకు చెందిన పీఆర్పీ బకాయిలు కూడా చెల్లించేందుకు చైర్మన్చొరవ చూపాలని ఆయన కోరారు.
