గోదావరిఖనిలోని నాలుగు లేబర్ కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను రద్దు చేయాలే : కార్మిక సంఘాల జేఏసీ లీడర్లు

గోదావరిఖనిలోని నాలుగు లేబర్ కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను రద్దు చేయాలే : కార్మిక సంఘాల జేఏసీ లీడర్లు

గోదావరిఖని, వెలుగు: కార్మిక హక్కులను కాలరాసేలా 44 కార్మిక చట్టాలను కేంద్రప్రభుత్వం నాలుగు లేబర్​కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లుగా మార్చిందని, వాటిని రద్దు చేయాలని కార్మిక సంఘాల జేఏసీ లీడర్లు డిమాండ్​ చేశారు. గురువారం గోదావరిఖనిలోని హెచ్ఎంఎస్​ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగిన మీటింగ్​లో సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక లీడర్లు మాట్లాడుతూ జులై 9న నిర్వహించబోయే దేశవ్యాప్త సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 

కార్మిక చట్టాలను రక్షించాలని, కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, తదితర డిమాండ్లతో జరగబోయే సంఘటిత, అసంఘటిత వర్గం పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి బుద్ధిచెప్పాలన్నారు. కార్యక్రమంలో రియాజ్​అహ్మద్, ఐ.కృష్ణ, జి.రాములు, ఏడుకొండలు, నరేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నారాయణ, తదితరులు.. ఎన్టీపీసీలో జరిగిన మీటింగ్​లో జేఏసీ లీడర్లు బాబర్​ సలీంపాష, భూమళ్ల చందర్, శంకర్​, లక్ష్మారెడ్డి, లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, చిలుక శంకర్​, నాగభూషణం పాల్గొన్నారు.