నవీన్ యాదవ్ గెలుపుతోనే జూబ్లీహిల్స్ అభివృద్ధి: సింగరేణి భూనిర్వాసితుల అసోసియేషన్

నవీన్ యాదవ్ గెలుపుతోనే జూబ్లీహిల్స్ అభివృద్ధి: సింగరేణి భూనిర్వాసితుల అసోసియేషన్

బషీర్​బాగ్, వెలుగు: జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్​ క్యాండిడేట్​ నవీన్​యాదవ్​ గెలిస్తేనే ఆ  నియోజకవర్గం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని సింగరేణి భూనిర్వాసితుల అసోసియేషన్​జనరల్ సెక్రటరీ నాంపల్లి రమేశ్​ అన్నారు. బుధవారం రహమత్ నగర్ డివిజన్‌‌లో నవీన్ యాదవ్‌‌కు మద్దతుగా సింగరేణి భూనిర్వాసితులు ప్రచారం చేపట్టారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారంలో ఉన్నందున కాంగ్రెస్​ గెలుపుతో నియోజకవర్గం మరింత డెవలప్​ అవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కంది శీను, గౌరవాధ్యక్షుడు రాసమల్ల సంపత్, బిక్కినేని మాధవరావు పాల్గొన్నారు.

యూసఫ్​గూడలో నవీన్​యాదవ్​ ప్రచారం..

ఉప ఎన్నికల్లో భాగంగా యూసఫ్ గూడలో కాంగ్రెస్​ అభ్యర్థి నవీన్​యాదవ్​ ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి ఓట్లు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కోఆర్డినేటర్ డాక్టర్ పీవీ.రవిశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ కార్యదర్శి కొప్పిశెట్టి దినేశ్​గౌడ్, గురునాథరావు, నాగరాజు, భరత్ కుమార్ పాల్గొన్నారు.