ఇస్రోలో శిక్షణకు సిరిసిల్ల యువకుడు

ఇస్రోలో శిక్షణకు సిరిసిల్ల యువకుడు

సిరిసిల్ల టౌన్, వెలుగు: అంతరిక్ష రంగంలో దేశానికి సేవలందిస్తున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లో ట్రైనింగ్​కు సిరిసిల్ల యువకుడు సిరిగిరి తేజస్విన్ వర్మ ఎంపికయ్యారు. కేరళలోని తిరువనంతపురంలో ఏరోస్పేస్ ఇంజనీర్​గా పనిచేస్తున్న తేజస్విన్​వర్మ ఇస్రోకు చెందిన ప్రతిష్టాత్మక విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (వీఎస్​ఎస్​సీ)లో శిక్షణకు  ఎంపికయ్యారు. 

ఈ మేరకు వీఎస్ఎస్సీ అధికారులు తేజస్విని వర్మకు ఆఫర్ లెటర్ అందజేశారు. సిరిసిల్లకు చెందిన యువకుడు దేశంలోనే ప్రతిష్టాత్మక అంతరిక్ష పరిశోధనా సంస్థలో శిక్షణకు ఎంపిక కావడం పట్ల కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేశారు.