పంచాయతీలు, మున్సిపాలిటీలను బలోపేతం చేస్తం : సిరిసిల్ల రాజయ్య

పంచాయతీలు, మున్సిపాలిటీలను బలోపేతం చేస్తం : సిరిసిల్ల రాజయ్య

హనుమకొండ, వెలుగు: రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలను బలోపేతం చేయడానికి తనవంతుగా కృషి చేస్తానని స్టేట్​ ఫైనాన్స్​ కమిషన్​ చైర్మన్​ సిరిసిల్ల రాజయ్య హామీ ఇచ్చారు.  ఎస్​ఎఫ్​సీ చైర్మన్​ గా బాధ్యతలు తీసుకున్న అనంతరం  మొదటిసారి వరంగల్ కు వచ్చిన రాజయ్యకు స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్​ రెడ్డి,  కాంగ్రెస్​ నేతలు మంగళవారం  స్వాగతం పలికారు.  కాజీపేట నుంచి హనుమకొండ అంబేద్కర్ సెంటర్‌‌‌‌ వరకు  ర్యాలీ నిర్వహించారు. 

ఆ తరువాత హనుమకొండలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిరిసిల్ల రాజయ్య మాట్లాడారు.   పదేండ్ల బీఆర్​ఎస్​ పాలనలో ఫైనాన్స్​ కమిషన్​  లేదని,  ప్రజాస్యామ్నాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో  రాష్ట్ర ఫైనాన్స్​ కమిషన్​ ఏర్పాటు  చేసి, తనకు  బాధ్యత అప్పగించారన్నారు.  ఈ కార్యక్రమంలో డీసీసీ వరంగల్​ ప్రెసిడెంట్​  ఎర్రబెల్లి స్వర్ణ, కార్పొరేటర్లు జక్కుల రవీందర్ యాదవ్,  విజయశ్రీసయ్యద్ రజాలి, వేముల శ్రీనివాస్, పోతుల శ్రీమాన్, తోట వెంకన్న, వీరగంటి రవీందర్, చీకటి ఆనంద్  పాల్గొన్నారు.